Friday

2.జ్ఞానేంద్రియాలు 1.

జ్ఞానేంద్రియాలు 5 అవి :


1. కన్ను
2. ముక్కు
3. చెవి
4. నాలుక
5. చర్మం

కన్ను 
కన్ను నిర్మాణంలో 3 పొరలు ఉంటాయి 
1. బయటిపొర : దృఢస్తరం (మొదటిపొర )
2. మధ్యపొర :రక్త పటలం (దీనిలో అనేక రక్త నాళాలు ఉంటాయి )
3. లోపలిపొర :నేత్ర పటలం (రెటీనా ) కంటిలోని జ్ఞానాభాగం 
కనుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంద్రాన్ని తారక (ఐరిస్ ) అంటారు 
కంటిలో 3 పొరలో 2 రకాల కణాలు ఉంటాయి. 
1. దండ కణాలు (రాడ్స్ )
2. శంకు కణాలు (కోన్స్ )
కంటిలో ఎక్కువ కాంతికి పనిచేసే నరాలను రాడ్స్ అని , తక్కువ కాంతికి పనిచేసే నరాలను కొన్స్ అంటారు 
దండకాణాలు రోడాప్సిన్ వర్ణకాన్ని కలిగి ఉంటాయి . రోడాప్సిన్ ఏర్పడటానికి విటమిన్-ఏ అవసరం. ఇవి నలుపు , తెలుపు రంగులు చూచుటకు తోడ్పడతాయి . నిశాచర జీవులయిన గుడ్లగూబ, గబ్బిలం లో ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. 
శంకుకణాలు ఐడాప్సిన్  అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ఇవి ప్రాధమిక వర్ణాలైన ఎరుపు , నీలం , ఆకుపచ్చ రంగులను గుర్తించుటకు సహాయపడతాయి . 
దండకాణాలు, శంకుకణాలు లేని ప్రాంతాన్ని అంధచుక్క అంటారు. ఈ  భాంగంలో  ప్రతిభింబం ఏర్పడదు 
కన్ను , కంటికి సంభందించిన వ్యాధుల అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఆఫ్తాల్మాలజీ అంటారు 






Thursday

7.భారత ప్రధానులు -రచనలు

-
భారత ప్రధానులు రచనలు
1. జవహర్ లాల్ నెహ్రూ :1. డిస్కోవరి ఆఫ్ ఇండియా (భారతదేశ అన్వేషణ )
2. ఏ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్
3. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ
4. ఎన్ ఆటో బయోగ్రఫీ
5. ఎ పొలిటికల్ బయోగ్రఫీ
2. ఇందిరాగాంధీ :
మై ట్రూత్
3. మొరార్జీ దేశాయ్ : ది స్టోరీ ఆఫ్ మై లైఫ్
4. ఎ . బి . వాజ్ పేయి :
న్యూ డైమెన్షన్ ఆఫ్ ఇండియాస్ ఫారిన్ పాలసి
5. ఐ . కె . గుజ్రాల్ : ఏ ఫారిన్ పాలసీ ఫర్ ఇండియా
2. కంటిన్యూటీ అండ్ చేంజ్
6. చంద్ర శేఖర్ : దీక్పెస్ట్ , ది హెర్డిల్స్
ఏ సోషలిస్ట్ మెన్
7. పి . వి . నరసింహ రావు : ది ఇన్ సైడర్



Wednesday

ఆహార పొట్లాల పంపిణీ పూర్తి

నేటితో 3153 వ రోజు
ఆహార పొట్లాల పంపిణీ పూర్తి
*********************************
ప్రతిరోజూ 200 మందికి ఆకలి తీర్చే
ఈ అన్నదాన మహాయజ్ఞాన్ని
ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నాము .
.

ప్రతిరోజూ 20 కేజీల బియ్యాన్ని ఉడికించి ,
.

ఆ అన్నాన్ని 200 ఆహార పొట్లాలలోకి
( లెమన్ రైస్ గానీ , పులిహోర గానీ )  సమపాళ్లలో చేర్చి ......
.

ఆ ఆహార పొట్లాలను 4 టీములలోని
స్నేహహస్తం డెవలప్ మెంటు సొసైటీ సభ్యులు
( ఒక్కో టీములో ముగ్గురు చొప్పున )
నిర్ణీత సమయంలో పంపిణీ చేస్తున్నారు .
.

ఈరొజు మా సోదరి  శ్రీమతి స్నేహలత రెడ్డి మరియు శ్రీ రామచంద్రా రెడ్డి బావ గార్ల
ముద్దుల తనయుడు చిన్నారి బాబు
మేఘశ్యామ్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ......
.

ఏ ఆసరా లేకుండా ఫుట్ పాత్ ల మీదనూ ,
బస్ షెల్టరు లలోనూ , ఆలయాల పరిసరాలలోనూ ఉండే అభాగ్యులకు , వికలాంగులకు , వృద్దులకు
లెమన్ రైస్ పొట్లాలతో పాటుగా గారెలను కూడా  పంపిణీ చేయడం జరిగింది .
.

గోపిరెడ్డి జగదీశ్వర రెడ్డి
అద్యక్షులు
స్నేహ హస్తం డెవలప్ మెంట్ సొసైటీ
Whatsapp : 84988 24581

Monday

*టోల్ గేట్ సమాచారం గమనిస్తే మంచిదేమో..

నిజమేనా
*టోల్ గేట్ సమాచారం గమనిస్తే మంచిదేమో..
మీ వాహనంలో  రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా టోల్ గేటు వస్తే, టోల్ బూత్ వద్ద టోల్ రుసుము చెల్లించే సమయంలో, రుసుము తీసుకునే వ్యక్తి ఒక వైపా, రెండు వైపులా up and down అని అడుగుతాడు. అపుడు మీరు ఇప్పటినుండి 12 గంటలు time అని చెప్పి రిసిప్ట్ తీసుకోండి. ఒకవేళ మీరు 12 గంటలు లోపులో వస్తే మళ్లీ టోల్ రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. ఆ విషయం టోల్ రిసిప్ట్ పై ముద్రించి ఉంటుందట...
ఈ విషయం చాలా మందికి వాహనదారులకు తెలియక, టోల్ వసూలు చేసే వాళ్లు చెప్పక సామాన్య ప్రయాణీకులను మోసం చేస్తూ,  కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు.
ఇకనుండైనా జాగ్రత్తగా ఉండండి...
ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర టోల్ గేట్లు, రోడ్లు , భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నే చెప్పారని తెలుస్తోంది....

వీఆర్వో కు లంచం కోసం భార్యా బిడ్డలతో రైతు బిక్షాటన .

వీఆర్వో కు లంచం కోసం భార్యా బిడ్డలతో రైతు బిక్షాటన ..
ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించిన పోలీసులు..

అధికారులకు లంచం ఇవ్వడం కోసం కుటుంబ సభ్యులతో కలసి భిక్షాటన చేసి వినూత్నంగా నిరసన  రైతు.  రాజును , అతడి భార్యను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.. తమ పరువు తీస్తున్నాడంటూ రెవిన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు అరెస్ట్ చేశారు..కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మాధవరం గ్రామానికి చెందిన వన్యం వెంకటేశ్వర్లు అలియాస్‌ రాజు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గౌరెడ్డికి ఇద్దరు కొడుకులు కాగా.. వారిలో వన్యం వెంకటేశ్వర్లు అలియాస్‌ రాజు రెండో కుమారుడు. వారసత్వంగా తనకు 25 ఎకరాల భూమి దక్కాల్సి ఉండగా, దీన్ని సమీప బంధువు ఆక్రమించాడని రాజు ఆరోపిస్తున్నాడు. తన భూమి తిరిగి ఇప్పించాలని రాజు కోరగా వీఆర్‌వో లంచం డిమాండ్‌ చేశాడు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం వెలుగోడు పట్టణంలో రాజుతో పాటు అతని భార్య, ఇద్దరు పిల్లలు చేతిలో గిన్నె పట్టుకొని.. మెడలో ఓ బ్యానర్‌ వేసుకుని భిక్షాటన చేయడం ప్రారంభించారు.
బ్యానర్‌పై ‘దయచేసి నాకు దానం చేయండి. డబ్బు చెల్లిస్తే ఏ పనైనా పూర్తవుతుంది. నేను అలా చేయలేకపోయా. కాబట్టి నా భూమిని కోల్పోయా. రెండేళ్ల నుంచి నా భూమి కోసం కష్టపడుతున్నా’ అని రాసి ఉంది. రాజు ఆరోపణల నేపథ్యంలో గురువారం ఆత్మకూరు సీఐ కృష్ణయ్య వెలుగోడు రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేపట్టారు. రాజు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తహసీల్దార్‌ శ్రీనివాసులు తెలిపారు. రాజు అనుభవంలో 2.15 ఎకరాల పొలం మాత్రమే ఉందని, దాయాదుల మధ్య వివాదాన్ని తమపై నెడుతున్నాడని ఆరోపించారు. ఆయన భూమికి సంబంధించి ఏమైనా సమస్య ఉంటే కోర్టుకెళ్లి తేల్చుకోవాలని తహసీల్దారు సూచించారు.

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు?

పెళ్ళిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరైన సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది. కనుక ఆ వేదిక పై అధికారం ఆరోజు ఆయనదాని శాస్త్రం చెప్తుంది.

కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చినవాళ్ళు మగపిల్లాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు. కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితి లో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత  ఔదార్యానికి తలవంచాలిగా?

కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి, కన్యాదాత మీద పడి అరవాడనికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది?దానం ఇస్తున్నవాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంచనాలు అవీ ఇవీ అడగచ్చు అని ఎవరు చెఫ్ఫారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకు అద్దుకుని పుచ్చుకోవడమే. వరుని ఇంటికి ఇరవై ఏళ్ళ పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు.  అంతకన్నా ఇంకేం కావాలి?

"సీతారాములలా ఉండండి!" అని వధూవరులను ఆశీర్వదించేయడం కాదు. నిజంగా సీతారామకళ్యాణ ఘట్టం చదివితే, మగ పెళ్ళివాళ్ళు ఎంత హద్దులలో ఉండి ప్రవర్తించాలో తెలుస్తుంది. జనక మహారాజు, దశరథ మహారాజుని అడుగుతారు "మీకు మా కుమార్తెని మీ ఇంటి కోడలుగా చేసుకోవడం అంగీకారమేనా?" అని. అప్పుడు దశరథ మహారాజు ఏమంటారో తెలుసా? "అయ్యా! ఇచ్చేవాడు ఉంటేనే కదా పుచ్చుకునేవాడు ఉండేది" అని. దశరథుడు ఎన్నో యజ్ఞయాగాదులను జరిపించిన మహారాజు. తన కుమారుడైన రామచంద్ర ఎంతో పరాక్రమవంతుడు, ఎంతో గుణవంతుడు. అయినా దాత అయిన జనకునితో మాట్లాడేటప్పుడు తన మర్యాదలో, తన హద్దులో తాను ఉన్నాడు.

అసలు వివాహ నిశ్చితార్థంలో తాంబూలాల కార్యక్రమం అంతా అయిపోయాక ఇరు వర్గాల వారూ కూర్చుని సీతారామకళ్యాణ సర్గ చదవాలి. ఎంత అందంగా అవుతాయో ఆ ఇంట్లో పెళ్ళిళ్ళు!

అసలు ఒక ఇంటి మర్యాద ఏమిటో వాళ్ళ ఇంట్లో పెళ్ళి చేసే రోజున తెలిసిపోతుంది.

తన కూతురి పెళ్ళి వైభవంగా జరిపించాలి అని కన్యాదాతకు తెలియదా? "పెళ్ళి బాగా గొప్పగా జరిపించండీ!" అని మగపెళ్ళివారు ప్రత్యేకంగా చెప్పాలా? కన్యాదాత తనకి ఉన్నదాంట్లో వేదికను ఏర్పాటు చేసి మీకు కన్యాదానం చేస్తాడు. దానం పుచ్చుకోవడానికి వచ్చినవానికి ఏర్పాట్లు ఎలా చెయ్యాలో చెప్పడానికి అధికారం ఉండదు.

కట్నాలు, ఎదురు కట్నాలు, పెళ్ళి వాళ్ళ అరుపులు, కేకలు, అత్తవారి చివాట్లు, ఆడపడుచుల దబాయింపులు - ఇలాంటివి సనాతన ధర్మానికి తెలియదు.

Sunday

మనం గొప్పగా బ్రతకడమే కాదు మన తోటి వారి బాధల్ని పంచుకోవడమే జీవితం

#AnjapallyNagamallu Anna God job anna 🙏 🙏

సూర్యాపేట జిల్లా నూతనకల్ మబడలం , చిలపకుంట్ల గ్రామములో రెండు కాళ్ళు లేని ఒక                       వికలాంగుడు మాట్టే చంద్రయ్య(55) తనతల్లి చంద్రమ్మ(90) సంవత్సరాల పండు ముసలి తల్లిని అన్ని తానై సాగుతున్న వైనం టీవీ లో వస్తే చూసాను ఉండటానికి ఇల్లు లేదు రెండుకాళ్ళు చిన్ననాటినుండే పోలియో తో చచ్చుబడి పోయిన చంద్రయ్య  తనను పెంచి పోషించిన తల్లికోసం ఇల్లు ఇల్లు తిరిగి అన్నం అడుకొచ్చి పెడుతూ సాదటం కన్నతల్లి ని ఎలా చూేసుకోవాలో తెలిపాడు. "మనల్ని కన్న తల్లిదండ్రులను అనాధాశ్రమం లో వదిలి..  మనం కొన్న కుక్క పిల్లల్ని పరుపు దిండ్ల మీద పెంచుతున్న రోజులివి" ఒక వికలాంగుడు ఎలాంటి ఆర్థిక స్థోమత, సెంటు భూమి లేని వ్యక్తి తన తల్లి కి అడుకొచ్చి పెట్టి సాదటం మనసును కదిలించింది, తన ఊరు వెళ్లి చూస్తే  ఎండలో ఒక కాళ్ళమంచం పై పడుకున్న పండు ముసలి తల్లిని నీడకు తీసుకెళ్లలేక ఒక దుప్పటి కప్పి పక్కనే కూర్చున్నాడు ఎందుకంటే ఇల్లు లేదు  రాత్రి చలికి వణికిపోతున్న తల్లికి రెండు దుప్పట్లు కప్పి పైన కవరుతో కప్పి ఉంచుతానాని రాత్రి సమయంలో పాములు , తేళ్లు, వస్తున్నాయని కుక్కలనుండి కూడా రక్షణ లేదని గ్రహించిన నేను వెంటనే నాలుగు గుంజల పాతించి కవరు కప్పిన చిన్న గుడిసె తాత్కాలికంగా ఏర్పాటుచేయడం జరిగింది. వారికి ముందు ఒక గూడు అవసరం వారికి రూమ్ కట్టించాలి అనుకున్నాను కానీ ఆ సమయంలో నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది .. ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు .. కానీ ఏదో ఒకటి చెయ్యాలి అని మాత్రం నిర్ణయించుకున్నాను  వెంటనే నా మెడపై ఉన్న బంగారు గొలుసు, చేతి ఉంగరం , మా పాపా బారసలకి తీసుకున్న రెండు గాజులు ముతూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి సుమారు 65 వేల రూపాయల తీసుకొని వెంటనే ఆ ఊరికి వెళ్లి ఇంటి నిర్మాణానికి పునాది తీయించి రాయి, ఇసుక, సిమెంట్, ఇటుక తోలించి  ఒక ఇంటిని నిర్మించి ఇచ్చాను వారికి ఈరోజు కొత్త బట్టలు పెట్టి ఇంటిని ప్రారంభించాం.ఈరోజు వారి కళ్ళల్లో ఆనందం చూస్తే నా బాధలన్ని మర్చిపోయాను.. " మనం గొప్పగా బ్రతకడమే కాదు మన తోటి వారి బాధల్ని పంచుకోవడమే జీవితం" అని మా అమ్మ నాన్న చెప్పిన మాటలు గుర్తుకుతెచ్చుకున్నాను.

Friday

చిన్న సందేశాత్మక కధ

చిన్న సందేశాత్మక కధ.
ఇది ఒక మధ్య తరగతి కుటుంబములో జరిగిన కథ.
                ఒక కొడుకుకి తన ఇంట్లో ఉండటం ఇష్టం లేదు. అతని తండ్రి ఆతనిని ఎప్పుడు నువ్వు ఫ్యాన్ స్విచ్  ఆఫ్ చేసి వేళ్ళు , T .V .స్విచ్ ఆఫ్ చేసి వేళ్ళు, టేబుల్,ఇల్లు శుభ్రంగా ఉంచుకో అని పదే పదే చెప్తు ఉండేవాడు .ఆ మాటలు ఆ కొడుకుకి నచ్చేవి కావు.ఇంట్లో ఉండటానికి ఇష్టం ఉండేది కాదు.
                 నిన్నటి వరకు ఆ తండ్రి మాటలు ఇష్టం లేక పోయిన వినేవాడు కానీ ఈ రోజు అతనికి ఒక ఉద్యోగానికి పిలుపు వచ్చింది . ఉద్యోగం రాగానే వేరే చోటుకి వెళ్లిపోవాలి అని మనసులో అనుకున్నాడు.
                 ఇంటర్వ్యూకి బయలుదేరాడు తండ్రి ఇంటర్వ్యూకి వెళ్తున్న  కొడుకుకి వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికి  దైర్యంగా సమాధానం చెప్పు ఒక వేళ నీకు తెలియకపోతే ఆ ప్రశ్నలని కూడా నువ్వు ధైర్యంగా ఎదురుకో అని చెప్పి ఖర్చులకు కొంచం ఎక్కువగానే డబ్బులు ఇచ్చి పంపాడు.
                 ఆ కొడుకు ఇంటర్వ్యూ జరుగుతున్న అడ్రస్ కు వెళ్ళాడు. అంత పెద్ద బిల్డింగ్ కి సెక్యూరిటీ లేదు.గేట్ యొక్క గడి కొంచం వెళ్తున్న వాళ్ళ చేతికి తగిలేటట్లు ఉంది దానిని సరిచేసి లోపలికి వెళ్ళాడు .లోపల గేట్ కి రెండు పక్కల చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి .ఆ మొక్కలకు నీళ్లు పట్టి టూబ్ ని నడిచే దోవలో పడేసి ఆ తోట వాడు మోటార్ ఆఫ్ చేయటానికి వెళిపోయాడు .ఆ టూబ్ ని చేతిలోకి తీసుకోని ఒక మొక్క యొక్క మొదళ్ళ మీద నీరు పడేటట్లు పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు.
                రిసెప్షన్ లో ఎవ్వరు లేరు. ఇంటర్వ్యూ కి 1 ST ఫ్లోర్ అని బోర్డు రాసి పెట్టి ఉంది .
మెల్లగా మెట్లు ఎక్కాడు దారిలో నిన్న రాత్రి వేసిన లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఎవ్వరు ఆఫ్ చేయకుండా ఉన్నాయి .లైట్స్ ఆఫ్ చేయకుండా వెళ్తున్నావు అని తండ్రి చెప్పిన మాటలు వినపడుతున్నట్లుగా సడన్ గా అనిపించి వెంటనే మెట్ల వద్దకు వెళ్లి లైట్స్ స్విచ్లను ఆఫ్ చేసి పైకి వెళిపోయాడు.
                       1ST ఫ్లోర్ లో ఒక పెద్ద హాలు లో చాలా మంది కూర్చొని ఉన్నారు. అంత మందిని చూసి నాకు ఇక్కడ ఉద్యోగం దొరుకుతుందా అని మనసులో అనుకుంటూ ముందుకు అడుగు వేసాడు, అక్కడ ఫ్లోరుపై ఉన్న MAT పై WELCOME తల క్రిందులుగా ఉంది దానిని కాలితో సరిచేసి లోపలికి వెళిపోయాడు.ఆ హాల్ లో ముందు వరుసలో  చాలా మంది కూర్చొని ఉన్నారు ,వెనుక వరుస కాళిగా ఉంది కానీ ఫ్యాన్ తిరుగుతూ ఉంది . గది లో ఎవ్వరు లేనప్పుడు ఫ్యాన్ ఎందుకు అని వాళ్ళ అమ్మ అన్నట్లు మాటలు వినపడ్డాయి వెంటనే ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటర్వ్యూ కి వచ్చిన వారితో కలిసి కూర్చున్నాడు.
                 ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళని ఒక దారిలో నుంచి లోపలికి పంపి వేరే దారిలోనుండి బయటకి పంపిస్తున్నారు ,దానివల్ల లోపల ఎటువంటి ప్రెశ్నలు అడుగుతున్నారో అనే విషయం తెలుసుకోలేక పోయాడు.లోపల ఏమి ప్రశ్నలు అడుగుతారో అనే భయంతోనే లోపలికి వెళ్లి నిలబడ్డాడు.అతని సర్టిఫికెట్స్ తీసుకున్న అధికారి తెరచి చూడకుండానే మీరు ఉద్యోగంలో ఎప్పుడు చేరతారు అని ఆ అధికారి అతన్ని అడిగాడు .ఇది కూడా ఒక ప్రశ్న లేక ఉద్యోగం లో చేరతారా అని అడిగారో అర్ధం కాకుండా ఆలోచిస్తూ నిలబడాడ్డు .
                         అధికారి ఏంటి ఆలోచిస్తున్నావు ఇక్కడ మేము ఎవ్వరిని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు వచ్చే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారో , ఎలా ప్రవర్తిస్తున్నారో చూడటానికి అక్కడక్కడా కెమెరాలు పెట్టాము .ఇక్కడికి వచ్చిన అందరూ వేస్ట్ అవుతున్న వాటర్ ని కానీ, టూబ్ లైట్స్ ని కానీ, ఫ్యాన్ ని కానీ ఆఫ్ చేయలేదు కానీ మీరు ఒకరే అనింటిని సరిచేస్తూ లోపలికి వచ్చారు.మేము మిమల్ని ఉద్యోగం లోకి తీసుకుంటున్నాము అని ఆ అధికారి చెప్పాడు. 
                       నాన్న చెప్పే మాటలు అన్ని నాకు విసుకు తెప్పించేవి,కానీ ఆ మాటలే ఇప్పుడు నాకు ఉద్యోగం ఇప్పించాయి అని సంతోష పడ్డాడు. తండ్రి మీద ఉన్న కోపం మొత్తం పోయింది . ఉద్యోగం లో చేరేటప్పుడు నాన్న ని కూడా ఇక్కడికి తీసుకురావాలి అని మనస్సులో అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు.
                       తండ్రి మన కోసం ఎం చెప్పినా ,ఎం చేసినా మన భవిష్యత్తు కి మంచి జరగాలనే చేస్తాడు.
                      ఉలి దెబ్బలకి శిల బాధపడుతుంది అనుకుంటే రాయి శిల్పం కాదు . ఆ బాధని తట్టుకున్నపుడే ఆ రాయి శిల్పంగా మారుతుంది .
                      తండ్రి మనలో ఉన్న చెడుని ఉలి పెట్టి కొట్టినట్లు పోగొడతాడు.తల్లి బిడ్డని పాలిచ్చి,లాలించి,కథ చెప్పి పడుకోపెట్టి పెంచుతుంది ,కానీ తండ్రి అలా కాదు తాను చూడని లోకాన్నితన కొడుకు చూడాలి అని తన భుజంపై కూర్చోపెట్టి లోకాన్నిచూపిస్తాడు.
తల్లి ఒక కవిత అయితే తండ్రి ఒక చరిత్ర!
                     తల్లి కష్టపడేదాన్నికనిపెట్టచ్చు కానీ తండ్రి కష్టాన్ని పక్కవారు చెప్తే కానీ కనిపెట్టలేరు.మనకి తండ్రి 5 సంIIల వరకు గురువు లాగా 25 సంIIలకు శత్రువు లాగా కనిపించే తండ్రి గురించి ఆయన చనిపోయిన తర్వాత ఆయన గొప్పతనం తెలుస్తుంది .తల్లి వృధాప్యంలో కొడుకు లేదా కూతురు ఇంట్లోనో ఉండి తన జీవితాన్ని గడుపుతుంది . తండ్రి అలా ఉండలేడు చివరి వరకు ఒంటరిగానే ఉండిపోతాడు .
                   అందువల్ల తల్లితండ్రుల్ని ప్రాణాలతో ఉన్నప్పుడే ప్రేమగా చూసుకోకుండా ప్రాణంతో లేనప్పుడు బాధపడి ప్రయోజనం లేదు.

మీ లో ఒకన్నీ

పైసలు ఉంటే నే సర్పంచ్ కి పోటీ చేయుర్రి అప్పు చేసి చేసి ఓడిపోతే అవ్వి కట్టే వరకే 5 ఏండ్లు కావాలి.సంకనాకి పోతారు
ఒకప్పుడు ఉండే మంచి తనానికి ఓట్లు పడుడు ప్రస్తుతం ఉన్న పరిస్తుతులలో అది చాలా తక్కువ అనే చెప్పలి జనాలు కూడా ఎంతో కొంత జ్ఞానం నేర్చుకున్నారు మనోడు, మన వాడోడు, మన కులపొడు, మన పాలోడు ఎదో విదంగా వాళ్లకు సంబంధం ఉన్న వ్యక్తి అయితేనే వాళ్లకు మంచిగ ఉంటదనే భావన వాళ్లలో చాలా ఉంది..
యువత యువత అని ముందుకు నుకి అన్ని నాకీ బజార్ల పడేస్తారు జాగ్రత్త...
యువత రాజకీయాల్లోకి వచ్చుడు మంచిదే కాదు అనను కానీ ఆర్థికంగా నిలదొక్కుకున్నాక అన్ని విషయాలు ఒక  అవగాహనకు వచ్చాక నిర్ణయం తీసుకుంటే మంచిది..

తోపు ఆనంగానే పొంగకుర్రి 😇
బుగ్గగాళ్ళు కాకుర్రి,పగులకుర్రి👍

మీ లో ఒకన్నీ

ఆ గొడ్డలి వెనుక వున్న కర్ర మా కులానికి చెందినది

అడవిలో ఎన్నికలొచ్చాయి.
అన్ని చెట్లకు ఓటు హక్కు కల్పించారు.
సెలయేరు గొడ్డలి పోటీ పడ్డాయి.
పోలింగ్ జరిగింది.
చెట్లకు జీవనాధారమైన నీరు ఇచ్చే సెలయేరు గెలుస్తుందని అందరూ విశ్లేషకులు అనుకున్నారు.
నిత్యం వృక్షాలను తెగనరికే గొడ్డలి చిత్తుచిత్తుగా ఓడిపోతుందని సర్వే ఫలితాలు  ముందే చెప్పాయి.
సెలయేటిపై గొడ్డలి భారీ మెజారిటీతో గెలిచింది.
ఆశ్చర్యపోయారు అందరూ...!!!
ఈ విషయమే వివిధ వృక్షజాతుల నాయకులను అడిగారు.
అవును...నిజమే.....
గొడ్డలి వలనే మా జాతి అంతరిస్తుంది...
కానీ...
ఆ గొడ్డలి వెనుక వున్న కర్ర మా కులానికి చెందినది.
అందుకే...ఓటేశాం...!
భగవంతుడా...
రక్షించు భారత ప్రజాస్వామ్యాన్ని....

Save birds

ఇది కథ కాదు..

చైనా లో ఒక పిచ్చుక ఒక సంవత్సరం లో సుమారు ఆరున్నర కిలోల బియ్యం ని తింటుందని లెక్క తేల్చారు. ఆ ధాన్యం అంతా కాపాడితే అరవై వేల మంది జనాభాకి ఆహారం సమకూర్చవచ్చని డిసైడ్ అయ్యారు! దాంతో సుమారుగా 30 లక్షల పిచ్చు కలని చంపేశారు!డబ్బాలతో కొట్టి చప్పుడు చేసి పారదోలారు. గూళ్లలో ఉన్న పిచ్చుకల గుడ్లన్నీ పగలకొట్టి చంపారు!
అలా పిచ్చుకలని నిర్మూలించటం వల్ల పంటలన్నీ పురుగు పట్టి అసలు ధాన్యమే లేకుండా పోయింది! ఆ దెబ్బకి తిండి దొరక్క తదనంతర కాలం లో తీవ్రమైన కరువు ఏర్పడింది.సుమారు నాలుగున్నర కోట్ల మంది తిండి దొరక్క చనిపోయారు!
ఈ కరువు నించి బయట పడటానికి..జరిగిన నష్టాన్ని పూడ్చుకోటానికి చైనా సోవియట్ యూనియన్ నించి వేల కొద్దీ పిచ్చుకలని దిగుమతి చేసుకుంది!

నీతి:- 1.Don't play games with nature.
2.Save birds.

Help

ఫంక్షన్ ఏదైనా -- ఆహారం మిగిలితే Call:  9848609768 .......ఆభాగ్యుల ఆకలి తీరుద్ధాం.... ఈ పోస్టుని మీ ఫేస్బుక్ మిత్రులందరికీ షేర్ చెయ్యగలరని ఆశిస్తూ..మీ ఒక్క షేర్ పది మంది ఆకలి తీర్చగలదు దయచేసి ప్రతి ఒక్కరు షేర్ చెయ్యండి

ఇలాంటి గాధలు చదివినప్పుడు హృదయం ద్రవించిపోతుంది...

ఇద్దరూ తోడూ నీడగా #బ్రతికారు ..
ఇద్దరూ చేతులుపట్టుకునే #ఆత్మహత్య చేసుకున్నారు..
ఇద్దరు #కొడుకులయ్యా .. ఒక్క #ఆడ బిడ్డయినా లేదు , ఉంటె హాయిగా ఉండేది.. ఇదీ ఆత్మహత్యకు ముందు వృద్ధ దంపతులు అన్న #చివరిమాట..
నెల్లూరు : ఆ వృద్ద దంప‌తుల‌కు ఏం క‌ష్ట‌మొచ్చిందో కానీ... జీవితంపై విర‌క్తితో ప్రాణాలు విడిచారు. ఇంటినుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన దంప‌తులు జ‌లాశ‌యంలో శ‌వాలై తేలారు. అనంత‌సాగ‌రం మండ‌లంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది.
వింజ‌మూరుకు మండ‌లం ఎర్ర‌బ‌ల్లిపాళెంకు చెందిన మాదిరెడ్డి చిన‌పెంచ‌ల‌రెడ్డి (75), ర‌మ‌ణ‌మ్మ (65) భార్యాభ‌ర్త‌లు నిన్న ఉద‌యం సోమ‌శిల జ‌లాశ‌యం వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఇక్క‌డ జ‌లాశ‌యంలో మునిగేందుకు ప్ర‌య‌త్నించ‌గా మ‌త్స్య‌కారులు అడ్డుకున్నారు.
త‌మ‌కు ఇద్ద‌రు కుమారులు అని, త‌మకు అనేక భాద‌లు ఉన్నాయ‌ని దంప‌తులు జాల‌ర్ల‌కు త‌మ భాద‌లు చెప్పుకున్నారు. వారికి సర్ధిచెప్పిన జాల‌ర్లు అక్క‌డి నుంచి పంపించేశారు. తీరా సాయంత్రం చూసేస‌రికి ఇద్ద‌రి మృత‌దేహాలు జ‌లాశ‌యంలో శ‌వాలుగా తేలాయి.
రాత్రి మృత‌దేహాల‌ను వెలికితీసేందుకు వీలుకాక‌పోవ‌డంతో ఇవాళ ఉద‌యం బ‌య‌ట‌కు తీశారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. మృతుల కుమారులు, కుటుంబ‌స‌భ్యులు అనంత‌సాగ‌రం పోలీస్ స్టేష‌న్ కు చేరుకున్నారు. పోలీసులు ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై విచార‌ణ జ‌రుపుతున్నారు.
Post copied
ఇలాంటి గాధలు చదివినప్పుడు హృదయం ద్రవించిపోతుంది...

Thursday

ఐదు రూపాయల డాక్టర్

ఐదు రూపాయల డాక్టర్ ఇక లేరు...
పేదల కన్నీటి నివాళి..

ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కేవలం ఐదు రూపాయలకే వైద్య చికిత్సలందిస్తూ వచ్చిన డాక్టర్‌ జయచంద్రన్‌ (71) బుధవారం కన్నుమూశారు. చెన్నై వాషర్‌మెన్‌పేటలో డాక్టర్‌ జయచంద్రన్‌ అంటే ఎవరికీ తెలియదు. ఐదు రూపాయల డాక్టర్‌ అంటే ప్రజలందరికీ సుపరిచితులు. ఆ స్థాయికి ప్రజల మన్ననలందుకున్న డాక్టర్‌ జయచంద్రన్‌ అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన మృతదేహాన్ని ఓల్డ్‌ వాషర్‌మెన్‌పేట వెంకటేశన్‌ వీధిలోగల ఆయన స్వగృహంలో ఉంచారు. వైద్యం వృత్తికాదని, అది సేవాభావంతో కూడుకున్నదనే విషయాన్ని విశ్వసించే జయచంద్రన్‌ తుదిశ్వాస వరకూ వైద్య వృత్తిలోనే తరించారు.
డాక్టర్‌ జయచంద్రన్‌ సొంతవూరు కాంచీపురం జిల్లా కొడైపట్టణం గ్రామం. 1947లో జన్మించిన జయచంద్రన్‌ పాఠశాల విద్య పూర్తికాగానే చెన్నై మెడికల్‌ కళాశాల్లో చదివి ఎంబీబీఎస్‌ పట్టా అందుకున్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు ఇష్టపడక ప్రజలకు సేవ చేయాలనే ఉద్ధేశంతో చిన్న క్లినిక్‌ ప్రారంభించారు. తన వద్దకు చికిత్స కోసం వచ్చే వారి వద్ద ప్రారంభంలో కేవలం రెండు రూపాయల ఫీజు మాత్రమే తీసుకునేవారు. అది కూడా అక్కడున్న హుండీలో వేయమని చెప్పేవారు. ఆయనే స్వయంగా ఇంజెక్షన్లు, మాత్రలు అందజేసేవారు. ఒకటి, రెండు రూపాయలకు విలువ లేకపోవడంతో రోగులు బలవంతపెట్టడంతో రూ.5 ఫీజు తీసుకునేవారు. తన చివరి శ్వాస వరకు ఇదే ఫీజుతో సరిపెట్టుకున్న మహా వ్యక్తి. ఆయన వైద్య సేవలకు కుటుంబం ఎంతగానో సహకరించింది. ఆయన క్లినిక్‌ ఎప్పుడూ జనంతో రద్దీగా  కనిపిస్తుంది. పేద, సామాన్య ప్రజలే ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతుంటారు.
కన్నీటి నివాళి: డాక్టర్‌ జయచంద్రన్‌ మరణవార్త తెలియగానే అనేక మంది పేద ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. శోకతప్త హృదయాలతో కుటుంబాలతో సహా ఆయన ఇంటికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.

రాజకీయాలలో ఉన్న పెద్ద మనుషులు

ఒక బస్సు ..
ఆ బస్సు రాత్రి 11 గంటలకు భద్రాచలం నుండి జగదల్ పూర్ వెళుతుంది అందులో చాలామంది ప్రయాణికులు ఎక్కారు
ఆ బస్సు బయలు దేరుతుంది కండక్టర్ టికెట్లు తీసుకుంటుండు అందర్నీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ముందుకు వస్తున్నాడు.
అలా సగం మంది టికెట్లు తీసుకో గా ఒక ఆయన దగ్గరికి వచ్చాడు ఓ పెద్దాయన టికెట్ తీసుకో అని చెప్పాడు
ఆ పెద్దమనిషి తన జేబులు అన్ని తడుముకొని చూసి అరే అరే నా జేబులో ఐదు వందల రూపాయల నోటు ఉండాలి అది ఎక్కడో పడిపోయింది అని ఆ పెద్దమనిషి చెప్పాడు
కండక్టర్ లేదు నువ్వు కచ్చితంగా టికెట్ తీసుకోవాలి లేదంటే నిన్ను ఈ మధ్యలోనే బస్సులో నుంచి దింపి వేయడం జరుగుతుంది అంటూ ఆ పెద్దమనిషిని తిట్టసాగాడు కండక్టర్

ఆ పెద్దమనిషి అయ్యా నేను ఒక ముఖ్యమైన పనిమీద వెళుతున్నాను నేను ఈ క్షణాన అక్కడికి వెళ్లకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది నేను కచ్చితంగా నేను వెళ్ళాలి అని కండక్టర్ ని వేడుకుంటూ ఉన్నాడు
ఇంతలో ఆ బస్సులోనే ఇంకొక రెండవ పెద్ద మనిషి అయ్యా అతని టికెట్ నేను తీసుకుంటాను అతని తిట్టొద్దు అంటూ రెండవ పెద్ద మనిషి మొదటి పెద్ద మనిషిని టికెట్ తీసుకున్నాడు

మొదటి పెద్దమనిషి ఆ టికెట్ తీసుకున్న రెండవ పెద్ద మనిషిని చూసి అయ్యా నువ్వు నిజంగా దేవుడవయ్యా అన్ని మొక్కడం మొదలుపెట్టాడు
నాకు ఈ ప్రయాణం ఎంతో ముఖ్యం అందరిలోనూ నువ్వు నాకు టికెట్ తీసుకున్నందుకు నువ్వు దేవుడవయ్యా

అని తను బస్సు దిగి ఇంటికి పోయిన తర్వాత కూడా బస్సులో ఒక పెద్ద మనిషి నాకు టికెట్ తీసుకున్నాడు అంటూ ఇంకా మనసులో ప్రార్థిస్తూ ఉన్నాడు ఇలా సాయం చేసినందుకు జీవితాంతం ఆ పెద్దమనిషిని మరవకుండా కొలవడం ఈ పెద్దమనిషి పని అయింది

అయితే తన దగ్గర ఉన్న 500 రూపాయలు ఎక్కడో పడిపోయి అనుకున్నాడు మొదటి పెద్దమనిషి
కానీ
రెండో పెద్ద మనిషే ఇతని 500 రూపాయలను దొంగలించింది ఇతగాడే....

ఐదు వందల రూపాయలు దొంగలించి 5 రూపాయల బస్సు టికెట్ తీసుకుని దేవుడవయ్యా అనిపించుకున్నాడు
ఆ రెండవ దొంగ పెద్దమనిషి

"#రాజకీయాలలో ఉన్న పెద్ద మనుషులు అందరూ తమ సొంత కష్టార్జితం సంపాదించి తన ఇంట్లో నుంచి ఇస్తున్నట్టుగా
పించన్ ఇస్తున్నాం
రేషన్ ఇస్తున్నాం
ఉచిత వైద్య ఇస్తున్నాం
ఉచిత విద్య ఇస్తున్నాం
ఉచిత కరెంటు ఇస్తున్నాం
ఉచిత భూములు ఇస్తున్నాం
ఉచిత త్రాగునీరు ఇస్తున్నాం
ఉచిత ఇండ్లను ఇస్తున్నాం
మరెన్నో ఇంకా ఉచితం... ఉచితం..... ఉచితం.....

ఇవి మొత్తం ఉచితం అయితే సమాజంలో ప్రజలపై
టాక్సెస్ పెరిగినాయి
పెట్రోలు పెరిగింది
బస్సు చార్జీలు పెరిగాయి
కరెంటు చార్జీలు పెరిగాయి
రాష్ట్రంలో దేశంలో అప్పులు పెరిగాయి
ఇలా చాలా చాలా దోపిడీ చేస్తోంది
రాజకీయ వ్యవస్థ.

అన్నీ పట్టించుకోకండి

అన్నీ పట్టించుకోకండి
ఒక పాము వడ్రంగి దుకాణంలో లోకి దూరి, అక్కడ వున్న రంపం పై నుండి ప్రాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది.  వెంటనే పాము కోపముతో రంపమును గట్టిగా కరిచింది.  ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేమి జరుగుతుందో తెలియక, రంపం తనపై ఎదురు దాడి చేస్తోందనుకుని
వెంటనే రంపమును గట్టిగా చుట్టుకుని, తన బలమంతా వుపయోగించి, రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపివేయాలని  నిర్ణయించుకొని, చివరికి తన ప్రాణం మీదకే  తెచ్చుకొంది.
మనము కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా, ఆవేశంలో మనకు కష్టం కలిగించిన వారిపై యిలానే స్పందించి‌, చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి  అసలు జరిగినదానికి సంబంధం లేదని తెలుసుకొనే లోపు, జరగవలసిన నష్టం జరిగిపోతుంది.
జీవితంలో ప్రశాంతంగా  వుండలంటే  కొన్నిసార్లు అనవసరమైన కొన్ని  పరిస్థితుల్ని, మనుషులను, వారి ప్రవర్తనను, వారి మాటలను, అసూయలను మరియు  ద్వేషాలను పట్టించుకోకుండా చేయవలసి వుంటుంది. కొన్నిసార్లు అసలు  ప్రతిస్పందించకపోవడమే  మంచిది....

MATHEMATICS TRICKS PART 3

1.51*59=

2509
2510
3010
3009

2.54*56=

3024
3022
3020
3026

3.16*14=

220
223
224
226

4.19*11=

119
210
211
209

5.17*13=

221
220
223
218

6.27*23=

622
624
621
620

7.77*73=

5624
5623
5620
5621

8.78*72=

5616
5618
5620
5614

9.71*79=

5607
5606
5608
5609

10.61*69=

4209
4204
4208
4206

11.64*66=

4218
4217
4220
4224

12.63*67=

4221
4220
4226
4218

13.76*74=

5620
5626
5618
5624

14.87*83=

7221
7222
7218
7220

15.96*94=

9026
9030
8124
9024

16.32*38=

1216
916
915
1214

17.26*24=

623
626
625
624

18.57*53=

3021
2521
2520
3020

19.61*69=

4208
4207
3609
4209

Wednesday

అమ్మను కొడుకులు వదిలేసారు, శిస్యులు కాదు

కేరళలో పంపనూరు రైల్వే స్టేషన్ పక్కన చెత్త కుప్ప దగ్గర ఒక పెద్దావిడ బిచ్చం అడుగుతూ కుర్చుని ఉంది ఆ పక్కనే ఒక ఆవిడ వెళుతూ ఈ పెద్ద ఆవిడని చూసి మల్లపురం స్కూల్లో నేను చదివేటప్పుడు లెక్కల టీచర్ కదా అని ఆశ్చర్యపోతూ దగ్గరికి వెళ్లి విచారించగా అవును నేను రిటైర్ అయిపోయిన తర్వాత నా పిల్లలు నన్ను వదిలేసి వేరే ఊర్లో వెళ్ళిపోయారు వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు ఇలాగ బిచ్చమెత్తుకుంటున్న ను అని చెప్పి దుఃఖంతో చెప్పింది. వెంటనే శిష్యురాలు కళ్ళమ్మట నీళ్ళు తిరిగి వెంటనే ఆ పెద్దావిడని ఇంటికి తీసుకు భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చింది. తరువాత టీచర్ కి భవిష్యత్తు గురించి ఆలోచించి శాశ్వతంగా భద్రత ఉంచాలని ఆలోచించింది. వెంటనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టింది. అది చూసిన పూర్వ శిష్యులు వెంటనే స్పందించి అందరూ కలిసి భద్రతా గృహంలో ఉంచారు. తల్లిని పిల్లలు వదిలేసినా శిష్యులు మాత్రం వదల్లేదు..


శిష్యులందరికీ అభివందనాలు

తేలుకాటు నివారణా యోగాలు

తేలుకాటు నివారణా యోగాలు  -
*  జీలకర్ర నూరి సైన్ధవ లవణం కలిపి ఇచ్చిన తేలుకాటు బాధ తగ్గును.
*  ఉత్తరేణి ఆకు రసం తేలుకాటు పైన రుద్దిన తేలు విషం దిగును.
*  జిల్లేడు పాలల్లో నేపాళం గింజలోని పప్పు నూరి తేలుకాటు వేసిన చోట అంటించాలి. గోమూత్రం 20 మి.లీ .లో పసుపు వేసి తాగించాలి . విషం దిగును .
*  ఉత్తరేణి చెట్టు వేరు బియ్యం కడుగుతో నూరి తాగించవలెను . తేలు విషం హరించును .
*  తులసి వేరును అరగదీసి ఆ గంధాన్ని తేలు కుట్టినచోట అంటించుచున్న తేలు విషం విరుగును.
*  దాల్చినచెక్క నూనె తేలు కుట్టినచోట దూదిలో ముంచి పెట్టిన నొప్పి తగ్గును.
*  గుగ్గిలం పొడి తేలు కుట్టినచోట పెట్టి నిప్పు వేడి చూపించిన విషాన్ని లాగేస్తుంది.
*  జీలకర్ర నూరి తేలు కుట్టినచోట అంటించిన నిప్పువేడి చూపిన విషం తగ్గును.
*  కుంకుడుకాయ తడిపి దాని గుజ్జుతో తేలుకుట్టిన చోట రుద్దిన బాధ తగ్గును.
*  ఎర్ర చేమంతి పువ్వుల రసం తేలు కుట్టినచోట వేస్తే విషప్రభావం దిగును .
*  గచ్చకాయలోని పప్పు నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట వేసి ఒక కాటన్ బట్ట కాల్చి ఆ పొగ గంథం పూసిన చోట చూపించవలెను.ఈ విధంగా చేసిన తేలు విషం దిగును .
*  ఇంగువను నీళ్లతో అరగదీసి ఆ గంధమును తేలు కుట్టినచోట దళసరిగా పూసి గుడ్డ ముక్క కాల్చి ఆ పొగ చూపించిన విషం దిగును .
*  మోదుగ గింజలను జిల్లేడు పాలతో నూరి ఆ గంధాన్ని తేలుకుట్టినచోట పూస్తే తేలు విషం దిగును .
           పైన చెప్పిన యోగాలలో మీకు సులభమైన యోగాన్ని ఎన్నుకొని ప్రయోగించండి.
    గమనిక  -
      
       నేను రాసిన "ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అనేక అమూల్యమయిన వైద్యపరమైన ఆయుర్వేద మూలికల ఉపయోగాలు ఇవ్వడం జరిగింది.
         
        ప్రాచీన ఆయుర్వేదానికి సంభందించిన అనేక రహస్య యోగాలు , మా వంశపారంపర్య అనుభవ యోగాలు , మన చుట్టుపక్కల దొరికే మూలికలు మరియు ఇంట్లో ఉన్నటువంటి వంట దినుసులతోనే పెద్దపెద్ద సమస్యలను నయం చేసుకునేవిధంగా అత్యంత సులభ యోగాలు మొక్కల యొక్క రంగుల చిత్రాలతో పాటు వాటి ఉపయోగాలు , చెట్లను బట్టి భూమిలో నీటిజాడను తెలుసుకొనుట, వృక్షాయుర్వేదం , పశువులకు సంబంధించిన అనేక యోగాలు మొదలైన అమూల్యమయిన విషయాలు ఇవ్వడం జరిగింది.
         

తొలి హరిజన ముఖ్యమంత్రి ఎవరు?

మీ కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడమ్మా అని చెబితే జీతం ఏమైనా పెరుగుతుందా అందంట ఒక మహాతల్లి. (బొగ్గుల కుంపటి కొనుక్కోవచ్చని ఆశగా)
                  (కిందిదంతా కాపీ పేస్టే)
దామోదరం సంజీవయ్య ను ముఖ్యమంత్రిగా నియమించాలని నెహ్రు నిర్ణయం తీసుకున్నారు.  అగ్ర కులాల ఆధిపత్యం అధికమైన కాంగ్రెస్ లోని కొందరు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒక హరిజనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడాన్ని సహించలేక పోయారు.   సంజీవయ్య అవినీతిపరుడు అని, లక్షలాది రూపాయలు సంపాదించారని నెహ్రు కు అనేక ఫిర్యాదులు వెళ్లాయి.  సంజీవయ్య నీతి, నిజాయితీ కూలంకుషం గా ఎరిగిన నెహ్రు వారి ఫిర్యాదులను కొట్టి పారేశారు.  అయినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మొండిపట్టు పట్టారు.  సరే, విచారిస్తాలే అని హామీ ఇచ్చారు నెహ్రు.  కొంతకాలం పాటు ఆ నిర్ణయం వాయిదా పడ్డది.
   అప్పుడు నెహ్రు తన ఆంతరంగిక మిత్రుడు అయిన ఓ నాయకుడిని ఆంద్ర వెళ్లి సంజీవయ్య మీద రహస్య విచారణ చేసి నివేదిక ఇవ్వమని కోరారు. ఆయన హైదరాబాద్ వచ్చి అప్పటి కాంగ్రెస్ యువనాయకుడు, నేటి ఆంద్ర ప్రదేశ్ శాసనమండలి చైర్మన్ అయిన చక్రపాణి గారిని కలిసి వచ్చిన పని చెప్పారు.  సంజీవయ్య గారి గూర్చి బాగా తెలిసిన చక్రపాణిగారు నిర్ఘాంతపోయి ఆ నాయకుడిని చివాట్లు పెట్టారు.  అయినప్పటికీ, ప్రధాని ఆదేశం కావడం తో వెళ్లాల్సిందే అన్నారు ఆయన. 
  ఇద్దరూ కలిసి సంజీవయ్య గారి గ్రామం వెళ్లారు కారులో.  గ్రామ పొలిమేరలలో ఒక పూరి పాక ముందు కారు ఆపారు చక్రపాణి.  ఆ పాక బయట ఒక వృద్ధురాలు కట్టెల పొయ్యి పై మట్టి కుండతో అన్నం వండుతున్నది.  పొగ గొట్టం తో మంటను ఊదుతూ చెమటలు కక్కుతున్నది.  "ఏమిటి ఇక్కడ ఆపారు?" ప్రశ్నించాడు నాయకుడు.  "సంజీవయ్య గారి ఇల్లు ఇదే.  ఆ వృద్ధురాలు ఆయన అమ్మగారు.  కారు దిగండి"  అన్నారు చక్రపాణి.  నాయకుడు నివ్వెరపోయాడు. 
  చక్రపాణి ఆమెకు నమస్కరించి "అమ్మా...ప్రస్తుతం మంత్రి గా ఉన్న  మీ అబ్బాయి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారు"  అన్నారు.  
  ఆమె చెమటలు తుడుచుకుంటూ  "అయితే మా వాడి జీతం ఏమైనా పెరుగుతుందా బాబు? ఈ కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం కష్టంగా ఉంది.  ఒక బొగ్గుల కుంపటి కొనిపెట్టమని ఎన్నాళ్ళ నుంచో అడుగుతుంటే, డబ్బులు లేవు అంటున్నాడు"  అన్నది. 
  నాయకుడి నోట్లోంచి మాట రాలేదు.  "సార్.. గ్రామం లోకి వెళ్లి విచారణ చేద్దామా?"  అడిగారు చక్రపాణి.  "అవసరం లేదు.  కారును హైద్రాబాద్ కు పోనీయండి"  అన్నాడు నాయకుడు. 
  ఆ తరువాత వారం రోజుల్లో సంజీవయ్య ఆంధ్రప్రదేశ్ తోలి హరిజన ముఖ్యమంత్రి అయ్యారు....
ఆ రోజుల్లో నాయకులు అలా ఉండేవారు మరి!!! *మరిప్పుడో*!!

Tuesday

MATHEMATICS TRICKS PART 2

1.11*21=

211
230
221
231

2.21*31=

651
615
620
650

3.31*41=

1261
1201
1271
1171

4.41*51=

2191
2171
2081
2091

5.51*61=

3111
3211
3011
3311

6.61*71=

4321
4322
4331
4311

7.71*81=

5551
5541
5651
5751

8.81*91=

7371
7361
7341
7351

9.21*41=

661
761
761
861

10.21*31=

651
551
550
541

11.21*51=

1271
1371
1171
1071

12.61*21=

1281
1381
1481
1380

13.71*21=

1492
1391
1392
1491

14.21*81=

1701
1601
1601
1611

15.21*91=

1901
1901
1921
1911

16.31*41=

1271
1272
1273
1371

17.31*51=

1582
1381
1481
1581

18.31*61=

1891
1881
1871
1861

19.31*71=

2221
2231
2301
2201