Saturday

45.గాంధీ పేరుతో బిరుదు కలిగిన వారు

ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ ౼ సరిహద్దు గాంధీ, ప్రాంతీయ గాంధీ
A.T.అరియరత్నే ౼ శ్రీలంక గాంధీ
జూలియస్ నైరేరి౼ టాంజానియా గాంధీ
కెన్నేట్ కౌండా ౼ ఆఫ్రికా గాంధీ
సర్దార్ జమాలపురం కేశవరావు ౼ తెలంగాణ సరిహద్దు గాంధీ

Monday

*HIV రోగులకు శుభవార్త ఎయిడ్స్ కి మందు కనిపెట్టేశారు*

*HIV రోగులకు శుభవార్త  ఎయిడ్స్ కి మందు కనిపెట్టేశారు*

పూర్తిగా తగ్గి పోతుంది చాలా మందికి తగ్గింది,  ఈ మందు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు, ప్రతీ సోమవారం నుండీ   శని వారం వరకూ  ఈ మందులు ఇస్తారు,
ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12గంటల వరకూ మాత్రమే మందులు ఇస్తారు  పేషంట్లు తమవెంట వారి ఆధార్ కార్డ్ మరియు రక్త పరీక్ష ల రిపోర్టులు తీసుకొని రావలెను ఇతరులకు సహాయము చేయాలి అనుకునే వారు ఈ post ని  తప్పని సరిగా SHARE   చేసి ప్రాణాలు కాపాడండి  ఇంకా  ఏమైనా వివరాలు  తెలుసు కోవాలి అనుకునే వారు నా సెల్ నెంబర్ల  కి కాల్ చేయండి ..9492916056, 8367746131;
అడ్రస్ :::  గవర్నమెంట్ హోమియోపతి హాస్పిటల్, రామంతాపూర్, దూరదర్శన్ TV స్టూడియో ప్రక్కన, హైదరాబాద్...................

HIV రోగులకు హోమియో మెడిసిన్స్

HIV..ప్రపంచాన్నే వణికిస్తున్న మహమ్మారి. దీనికి హోమియోపతి మెడిసిన్ ఇప్పుడు మంచి రిలీఫ్ ఇస్తోందంటున్నారు డాక్టర్లు. బ్రెజిల్ లో ఉండే అరుదైన జాతికి చెందిన క్రోటలస్ హరిడస్ పాము విషంతో తయారు చేసిన ఈ మెడిసిన్ తో వ్యాధిగ్రస్తులకు CD4 కౌంట్ తగ్గుతోందని చెబుతున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ కూడా ఈమెడిసిన్ కు ఓకే చెప్పింది. రిజల్ట్ కూడా మెరుగ్గా ఉండండతో రోగులు కూడా ఈ మందునే వాడుతున్నారు.

HIV వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్న బాధితులకు.. రామంతాపూర్ లోని హోమియో దవాఖాన.. ఊపిరి పోస్తోంది. HIV రోగానికి ఇక్కడిస్తున్న మందులు బాగా పనిచేస్తూ ఉండండతో..భారీ సంఖ్యలో రోగులు వస్తున్నారు. ఆంద్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి రోజూ వేలసంఖ్యలో రోగులు ట్రీట్ మెంట్ కోసం వస్తున్నారు. మెడిసిన్ కోసం అర్థరాత్రి నుంచే క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. సోమవారం, గురువారాల్లో రోగుల సంఖ్య రెట్టింపు ఉంటుంది.

ఆస్పత్రికి రాగానే… మొదట రోగి బరువు, ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఒక చిట్టీ రాసిస్తారు అక్కడి సిబ్బంది. ఆ తర్వాత అందరికీ హోమియో మెడిసిన్ ఇస్తారు. ఈ మందులు వాడడంతో CD4 కౌంట్ తో పాటు ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతోందని రిపోర్టులు కూడా చూపిస్తున్నారు. కొందరు మాత్రం యాంటీ రిట్రోవైరల్ థెరపీ ని వాడుతున్నామనీ.. తమకు కూడా కౌంట్స్ తగ్గుతోందని తెలిపారు. అయితే ఈమెడిసిన్ ఇంకా బాగా పనిచేస్తోందని తెలియడంతో ఇక్కడకు వచ్చామంటున్నారు.

పేషంట్లకు ఇచ్చే హోమియో మెడిసిన్ తెల్లటి చక్కెర గోళీలా ఉంటుంది. కానీ ఈ క్రోటలస్ హారిడస్ 30 అనేమందు తయారీ చాలా కష్టమైనదని చెబుతున్నారు. బ్రెజిల్ లో మాత్రమే ఉండే క్రోటలస్ హారిడస్ అనే అరుదైన పాము విషం నుంచి తీసే ఈ మందు చాలా పవర్ ఫుల్ అంటున్నారు. ఒక్కమిల్లిగ్రామ్ పాము విషానికి 99 మిల్లీగ్రామ్లో ఇతర రసాయనాలు మిక్స్ చేస్తే మెడిసిన్ రెడీ అవుతుందని అంటున్నారు డాక్టర్లు.

రాష్టం మొత్తంలో HIV బాధితులు లక్షా 60వేల వరకు ఉండొచ్చన్నది అంచనా. వీళ్లతోపాటు.. ఇతర రాష్ట్రాలనుంచి వస్తున్న వాళ్ల సంఖ్య మరో 60వేల వరకు ఉండొచ్చని భావిస్తున్నారు డాక్టర్లు. మెడిసిన్ కోసం వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉండడంతో..మెడిసిన్ సప్లై పై ఆస్పత్రి అధికారులు స్పెషల్ దృష్టి సారించారు. మరిన్నిసేవలు రోగులకు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మందులతోపాటు.. టెస్టులు చేయించుకునేందుకు.. ల్యాబ్ లు కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు

FILL IN THE BLANLS PART 1

1.the flash of the torch--------a cobra
1.exposed
2.displayed
3.disclosed
4.revealed

2.he-------himself a stiff drink before making his statement to the police officer.
1.threw
2.poured
3.filled
4.sipped

3.it was his ----that led him to penury.
1.flamboyance
2.arrogance
3.extravagance
4.ebullience

4.gita was known to be a ------so nobody entrusted any important work to her
1.joker
2. wprker
3.shoker
4.shirker

5.the statue was so----that people stared at it in horror
1.grotesque
2.exquisite
3.beatific
4.cumbersome

6.he was caught red-handed and could not------the charges
1.refute
2.refuse
3.rebuke
4.revoke

7.unhappy about the treatmentmeted out to her, shanti----demanded justice.
1.sumptuously
2.voraciously
3.spasmodically
4.vociferously

8.The police sprayed ter gas----on the protesters.
1.indirectly
2.intensively
3.indifferently
4.indiscriminately

9.We are happy to -----the receipt of your order No 4071 dated 13.3.96
1.admit
2.accept
3.acknowledge
4.respond

10.All jobs are respectable----of their nature.
1.irrelevant
2.immaterial
3.irresponsible
4.irrespective

11.Nadheeka was musing-----memories of the past
1.over
2.about
3.on
4.from

12.The lame boy tried to climb up the staircase without------help.
1.little
2.any
3.some
4.many

13.Each school has its own set of rules-----all good pupils should follow

them.
1.but
2.or
3.so
4.and

14.on my return from a long holiday, i had to-----with a lot of work.
1.catch on
2.catch up
3.make up
4.take up

15.only one of the boys----not done the home-work given yesterday.
1.have
2.has
3.can
4.could

16.Hopes of a settlement depends on the----of the discussion.
1.findings
2.outcome
3.break through
4.resolutions

17.we must avail ourselves------every opportunity that comes----our way.
1.of;in
2.on;in
3.against;for
4.to;to

18.It is time we------with determination.
1.act
2.acted
3.have acted
4.will act

19. When the thief entered thehouse, the inmates......in the hall.
(1) were slept
(2) were sleeping
(3) slept
(4) had been sleeping

20. 700 men worked for 10 years to.......the Borobudur temple in
Java to its former glory.
(1) restore 
(2) give
(3) create
(4) revive

21. The thief explained how he......from the jail.
(1) escapes
(2) had escaped
(3) escaped
(4) has escaped
.

22. He held......to the books passionately
(1) on
(3) off
(2) in
(4) away

23. They did not know where they......from.
(1) had come
(2) have come
(3) has cor
(4) come

24. There is only one member who has not paid his......And he has
promised to pay before the end
of this month.
(1) remittance
 (2) honorarium
(3) subscription 
(4) allowance

25. He was an......Swimmer, but was swept away by a strong........
(1) eligible: water
(2) able; stream
(3) old: river
(4) expert; current

4.వ్యాధి విజ్ఞాన శాస్త్రం

వ్యాధి విజ్ఞాన శాస్త్రం


వ్యాధులకు సంబంధించిన శాస్త్రాన్ని పాథాలజీ
ఆరోగ్యము , దాని సంరక్షణ గురించి తెలియోజేయు శాస్త్రం హైజీన్
వ్యాధినిరోధక శక్తి /అసంక్రామ్యత గురించి అధ్యయనం -ఇమ్యునాలజీ
ప్రపంచంలో ఏ వ్యాధికి మొదటి సారిగా వ్యాక్సిన్ కొనుగోన్నారు -స్మాల్ పాక్స్ (మాసూచి ).
వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త -ఎడ్వార్డ్ జెన్నర్
"ఫాదర్ ఆఫ్ ఇమ్యునాలజీ" అని ఎవరిని అంటారు -ఎడ్వార్డ్ జెన్నర్
"ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ "అని ఎవరిని అంటారు-ఎడ్వార్డ్ జెన్నర్
కలరా వ్యాధికి టీకాను కనుగొన్నవారు -లూయి పాశ్చర్
ఆంత్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నవారు-లూయి పాశ్చర్
రేబీస్ (హైడ్రోఫోబియా ) వ్యాధికి టీకాను కనుగొన్నవారు-లూయి పాశ్చర్
పోలియో వ్యాధికి వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త-జోనాస్ సాల్క్
పోలియో వ్యాధికి వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త(డ్రాప్స్ రూపంలో )-సేబీస్
తట్టు (మీజిల్స్ ) వ్యాధికి వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త-జాన్ ఎండార్స్
హెపటైటిస్ వ్యాధికి వ్యాధికి వ్యాక్షిన్ కొనుగొన్న శాస్త్రవేత్త-శాంతా బయోటిక్స్
జాతీయ టీకా కార్యక్రమంలో భాగంగా ఇచ్చే ఒకే ఒక రికాంబినేట్ వాక్సిన్ -హెపటైటిస్ -బి  టీకా
జాతీయ టీకా కార్యక్రమం -1978
గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు :
జలుబు
ఆటలమ్మ
బర్డ్ ఫ్లూ
స్వైన్ ఫ్లూ
మశూచి
తట్టు (జాన్ ఎండార్స్)
న్యూమోనియా
డిప్తీరియా
కోరింత దగ్గు
క్షయ
సార్స్
కలుషిత ఆహారం , నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు:
కలరా
టైఫాయిడ్
అమీబియాసిస్
పోలియో
డయేరియా (అతిసారం )
హెపటైటిస్ (పచ్చకామెర్లు )
ప్రత్యక్ష తాకిడి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు:
గజ్జి 
ఆటలమ్మ 
చిడుము 
తట్టు 
తామర 
సిఫిలిస్ 
గనేరియా 
ఎయిడ్స్ 

ఈగల ద్వారా వచ్చే వ్యాధులు: 
కలరా 
టైఫాయిడ్ 
క్షయ 
డయేరియా 
అమీబియాసిస్ 
ఎలుకలు ద్వారా వచ్చే వ్యాధి :ప్లేగు 

దోమల ద్వారా వ్యాప్తిచెందే వ్యాధులు :
మలేరియా :ఆడ ఎనాఫిలస్ దోమ 
ఫైలేరియా (బోదకాలు)-ఆడ క్యూలెక్స్ దోమ 
మెదడువాపు (జపనీస్ ఎన్సెఫలైటిస్ ):ఆడ క్యూలెక్స్ దోమ 
డెంగ్యూ , చికెన్ గున్యా :::ఆడ ఏడిస్ 

పందుల  ద్వారా వ్యాప్తిచెందే వ్యాధులు :
స్వైన్ ఫ్లూ , మెదడువాపు  
పోషకాహర లోపం వల్ల కలిగే వ్యాధులు :
క్వాసియార్కర్:
క్వాసియార్కర్ అనగా  ఆఫ్రికా భాషలో నిర్లక్ష్యము చేయబడిన శిశువు అని అర్ధం . 
ప్రోటీన్ లోపం వల్ల చిన్న పిల్లల్లో ఈ వ్యాధి వస్తుంది . తల్లి పాలు పిల్లలకు అందకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది .ఈ వ్యాధికి సంబంధించిన పిల్లల్లో పెరుగుదల మందగిస్తుంది . తరచుగా అతిసార వ్యాధితో బాధ పడతారు . కాళ్ళు , మొహం ఉబ్బి ఉంటాయి . 
మెరాస్ మస్ :
ఈ వ్యాధి ప్రోటీన్ +కేలరీల లోపం వల్ల వస్తుంది . 
దీనివల్ల ఉండే శరీర బరువుకన్నా 40% తక్కువగా ఉంటారు . 
దీనివల్ల కాళ్ళు , చేతులు పుల్లల్లా ఉండి ప్రక్కటెముకులు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి 
జన్యు సంబంధ వ్యాధులు :
హీమోఫీలియా /రాయల్ డిసీజ్ /బ్లీ డర్ డిసీజ్:
ఈ వ్యాధి పురుషుల్లో అధికంగా కనిపిస్తుంది . 
రక్తం గడ్డకట్టడానికి అవసరమైన త్రాంబో ప్లాస్టిన్ అను పదార్దాన్ని ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేకమైన జన్యువు X క్రోమోసోములో ఉంటుంది 
ఈ జన్యు లోపం ఉన్న వారిలో ఎంత చిన్న గాయం అయినను రక్తం గడ్డకట్టకుండా కారిపోతుంది .చివరికి మరణానికి దారితీస్తుంది . 
వర్ణాంధత్వము :(కలర్ బ్లైండ్ నెస్ )
వీరు ప్రాథమిక వర్ణాలైన ఎరుపు , నీలం , ఆకుపచ్చ రంగులను గుర్తించలేరు . 
ఎరుపును గుర్తించలేకపోడమును -ప్రోటోనోపియా 
నీలంను గుర్తించలేకపోడమును-triatonopia 
ఆకుపచ్చను గుర్తించలేకపోడమును-డ్యూటెరానోఫియా 
అల్బినిజం :
మెలనిన్ లోపం వల్ల చర్మము తెలుపు రంగులో ఉంటుంది . 
సికిల్ సెల్ ఎనిమియా (కొడవలికన రక్తహీనత ):
ఎర్ర రక్తకణాలు కొడవలి ఆకారంలోకి మారి రక్తకణాలను గాయపరిచే వ్యాధి . ఇది ఎక్కువగా నీగ్రో జాతులలో జరుగును . 
హైపర్ టైకాసిస్ :
శరీరంపై ఎక్కువ వెంట్రుకలు ఏర్పడటం . 


























►►1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం ◄◄

►►1970 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే ఇది మీకోసం ◄◄

►వీధుల్లో ఆటలాడి, నేర్చుకున్నది మనదే చివరి తరం.
►వీధుల్లో కోడా బిళ్ళలు, గోలీలు ఆడినది మనదే చివరి తరం.
►మట్టి లో ఆటలాడిన తరమూ మనదే..
►పోలీస్ వాళ్ళని నిక్కర్లలో చూసిన తరమూ మనదే.
►రబ్బర్ బాల్ తో ఈప్చాండ్ ఆడి మన ఫ్రెండ్ వీపు పగల గొట్టిన చివరి తరం మనదే
►స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే.
►చాలా దూరం వాళ్ళు అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు.
►స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే..
►మనమే మొదటగా వీడియో గేములు ఆడటం. కార్టూన్స్ ని రంగులలో చూడటం. అమ్యూజ్ మెంట్ పార్కులకి వెళ్లటం.
►రేడియోలలో వచ్చే పాటలని టేప్ క్యాసెట్లలో రికార్డింగ్ చేసినవాళ్ళం.
►వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం.
►యంటినా తిప్పుతూ టీవీ సిగ్నల్ ను సరి చేసిన ఆఖరి తరం మనదే
►డీడీ8 చానెల్ ను ఎక్కువగా చుసిన ఆఖరి తరం మనదే
►మన వీధి లో అమ్మే గ్రీటీంగ్స్ కొని ఫ్రెండ్స్ కు పంచిన ఆఖరి తరం మనదే
►ఇంటర్నెట్ లో చాట్ రూం లలో మాట్లాడినవాళ్ళం.
►VCR ని ఎలా వాడాలో తెలుసుకొని, వాడిన తరం మనదే..
►అలాగే అటారి, సూపర్ నిటేండో లో విడియో టేపుల ద్వారా ప్రోగ్రామ్స్ 56 K బిట్ మోడెం లో ఎలా పనిచేస్తాయో తెలుసుకున్న తరం.
►కార్లో సీట్ బెల్ట్స్ పెట్టుకోకుండా ప్రయాణించిన తరం కూడా మనదే. అలాగే ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ప్రయాణించిన తరం కూడా మనదే.
►సెల్ ఫోన్స్ లేకుండా మామూలు ఫోన్స్ తో రోజులని వెళ్ళదీశాం, మరియు స్మార్ట్ మొబైల్ ను కుడా వాడుతున్నాము
►సైకిల్లకి బ్రేకులు లేకుండా రోడ్డు మీద ప్రయాణించిన ఆ రోజులు మనవే.
►మన వద్ద ఫోన్స్ లేకున్నా అందరితో అందుబాటులో, టచ్ లో ఉండేవాళ్ళం.
►స్కూల్ కి మామూలు బట్టలూ, కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా వెళ్ళాం. ఇప్పటి తరం అలా ఎన్నడూ వెళ్ళలేదు.
►స్కూల్ లో బెత్తం తో దెబ్బలు తినేవాళ్ళం.
►స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని, ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం.
►ఎవరి ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ కి వెళ్ళేవాళ్ళం, క్లాసులో ఆ బేధాలు చూపే వాళ్ళం కాదు.
►చెరువు గట్ల వెంట, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం. జాతరలలో దుమ్ము దుమ్ము ఉన్నా అన్నీ తినేవాళ్ళం.
►సాయంత్రం వేల ఉప్పుడు బేరలు, అష్ట చెమ్మ. వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే.
►శుక్రవారం సాయంత్రం " చిత్రల హరి" కోసం ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే
►ఆదివారం ఉదయం 9 కి ట్యూషన్ తప్పించుకుని"మహాభారతము" " రామాయణం" " శ్రీకృష్ణ" చూసిన తరమూ మనదే...
►ఉషశ్రీ గారి భారత రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే,
►అమ్మ ఇచ్చిన రూపాయి ని అపురూపం గ చూసుకున్న ఘనతా మమదే ..
►ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే...
►పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే.
►రుపయిన్నరకు థియేటర్ లో సినిమా...
►బ్లాక్ అండ్ వైట్ టీవీ లో సినిమా చూడడానికి
►రెండు కిలోమీటర్ లు నడిచిన కాలం
►గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం...మనమే..
►అమ్మ 25 పైసలు ఇస్తే అయిదు బలపాలని అపురూపంగా దాచుకున్న కాలం...మనమే..
►గోర్లపైన కొంగ గోరు గుర్తులు
►చువ్వాట..సిర్రగోనే ఆట..కోతి కొమ్మ...అష్ట చెమ్మ...ఆడిన తరము మనదే.
►క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే.
►ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే..
►మన వద్ద అప్పుడు ప్లే స్టేషన్, 200+ ఛానల్స్ టీవీ, ఫ్లాట్ స్క్రీన్స్, సరౌండ్ సౌండ్స్, MP3, ఐ ప్యాడ్స్, కంప్యూటర్స్, బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్....... లేకున్నా అంతులేని ఆనందాన్ని పొందాం. ఇప్పడు వాటిని వాడుతున్నాము కుడా
ఇలా చెపుతూ పొతే ఇంకా చాల నే ఉన్నాయ్
ఈ 1970 - 1990 మధ్యలో పుట్టిన వారు అటు పాత తరానికి మరియు కొత్త తరానికి మధ్య
◄◄వారధి లాంటి వాళ్ళు అని నేను అంటాను మీరేమంటారు. ?◄◄

Friday

భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి తొలిసారి చెప్పిన త్రిమూర్తులు అటల్, జార్జ్ మరియు అబ్దుల్ కలాం.

(దివంగత జార్జ్ ఫెర్నాండిజ్ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు కష్టపడి టైప్ చేసా. దయచేసి చదవండి)
ఆ తండ్రి తన కొడుకును చర్చికి ఫాదర్ గానో ధర్మగురువుగానో చేయాలని ఆశపడ్డాడు.
ఇష్టం కాలేదు కొడుకుకు.
ఈ దేశపు మట్టి గుణం చూడండి.
కొడుకు తనకు ఉపదేశం చేసే వాళ్ళనే ప్రశ్నించడం మొదలుపెట్టాడు.
ఆ మతంలో ఆచారాల్లో చెప్పేదొకటి చేసేదొకటి అని ధృడపరచుకున్నాడు.
ఎట్టిపరిస్త్తితుల్లోనూ మనసుకు నచ్చని పని చేయనేకూడదని నిశ్చయించుకున్నాడు.
అతడడిగే ప్రశ్నలకు ధర్మగురువులు ఉత్తరం ఇవ్వలేకపోయేవారు.
తండ్రికి ఫిర్యాదు చేశారు కొడుకుమీద.
తండ్ర్రికి కోపం వచ్చి ఇంటినుండి వెలేశాడు.
అనుమానాలు, ప్రశ్నలు సహజమైన సమాజవాదియొక్క మూల గుణాలు.
అతడు జార్జ్ ఫెర్నాండెజ్..
జార్జ్  ఏమాత్రం బెదరలేదు..
ఒకరివద్ద చిన్నపనికి చేరుకున్నాడు.
అక్కణ్ణుండి ముంబై వెళ్ళి కార్మిక నాయకుడైన డిమెల్లో అనే వ్యక్తివద్దకు చేరాడు.
అక్కడే ఉండే సోషలిస్ట్ పార్టీ కచేరీ బెంచీమీద పడుకునేవాడు.
కడుపారా రొట్టెముక్కకూ కష్టమయ్యేది.
ముంబై ఫుట్ పాత్ పై కూడా చాలా రాత్రులు గడపాల్సివచ్చింది.
అంత కష్టం.. ఆ స్థలానికీ రోజూ కొట్లాటలు.. రౌడీలతో తొందర. ఒకరాత్రి నిద్రపోవడానికి పావలా సుంకంగా ఇచ్చుకోవాల్సివచ్చేది.
ఒక్కోసారి జీవితం లో మలుపులు.. కష్టాలు మనిషిని ఉన్నతస్థితికి తీసుకుపోతాయి.
చూస్తూండగానే జార్జ్ కార్మికనాయకుడై ఎదిగాడు.
అకస్మాత్తుగా అతడు కాంగ్రెస్ లో ప్రభావంతమైన నాయకుడిగా వెలుగుతున్న ఎస్.కె. పాటిల్ అనే వ్యక్తిపై ఎన్నికల్లో నిలవాల్సిన సందర్భం వచ్చింది.
ఎస్.కె.పాటిల్ అనే వ్యక్తికి ఎంత అహంకారం అంటే  “నన్ను ఓడించడం ఆ దేవుడితరమూ కాదు” అనేంతగా.
ఆ అహంకారం పేదప్రజల ఆరాధ్యదేవత అని చిత్రింపబడిన, ప్రజలకుండే మూర్ఖ, మూఢ అభిమానం పొందిన ఇందిరాగాంధీ  వల్ల వచ్చింది. దీనికి నెహ్రూ గాంధీ ల ఫోటోలూ తోడవడంతో కాంగ్రెస్ నాయకుల అహంకారం పేద ప్రజలతో ఆడుకునేలా చేసేది.
జార్జ్ బుద్ధివంతుడు.
కరపత్రాలు ముద్రించాడు. తనే స్వయంగా ప్రతి ఓటరువద్దకూ వెళ్ళి పంచి చెప్పసాగాడు
“సోదరులారా.. నిజం.. దేవుడిని ఓడించడం ఎవ్వరితరమూ కాదు. అయితే అహంకారంతో ఉన్న ఎస్.కె.పాటిల్ ను ఓడించడం కష్టం కాదుకదా.. ఆలోచించండి”
ఓటరు మహాశయుడు కరుణించాడు.. ఓట్లవర్షం కురిపించాడు.
అహంకారులైన కాంగ్రెస్ నాయకులేకాదు ఇందిగాగాంధీ కనుబొమలు పైకెగిసేలా చేశాడు.
=====
1975లో ఎమర్జెన్సీ వచ్చింది..
ఉన్న కోపం.పగ చల్లార్చుకోడానికి జార్జ్ ను చేతులకు సంకెళ్ళు వేసి జైలులో పెట్టారు.
ప్రజాపక్ష నాయకుడుకదా.. అదరలేదు బెదరలేదు. జైలునుండే ఎన్నికల్లో పోటీ  చేశాడు జార్జ్.
జార్జ్ కు అతడి తల్లి ప్రోత్సాహం అందించి ప్రజల్లో ప్రచారం చేసింది.
ఆ గెలుపు భవ్యమైనది. ఇందిరాగాంధీనీ భయపడేలా చేసింది. అంత గొప్ప గెలుపది.
ఇందిరాగాంధి హయాం లో దేశం మొత్తం గుత్తాధిపత్యంలో ఉండేది.
మీడియా సంస్థలు అధికారపక్షం ఏం చెబితే అదే రాసే పరిస్థితి. రేడియో గురించి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.
అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పై వ్యతిరేకతను వ్యక్తపరుస్తూ జార్జ్ భారత్ బంద్ పిలుపిచ్చాడు.
రైల్వేలతో సహా దేశం మొత్తం ఒకరోజుపాటు సంపూర్ణ బంద్ ఆచరించింది.
అదీ జార్జ్ పై ప్రజలకున్న గౌరవం..నమ్మకం. ఆయనకున్న బలం.
మొరార్జీదేశాయి అధికారం లో ఉండగా కేంద్ర సమాచార శాఖ మంత్రయ్యాడు.
తర్వాత మానవ వనరులశఖా మంత్రి అయ్యాడు.
ప్రపంచం మొత్తం కాంగ్రెస్ చెట్టులా ప్రాకిన కోకాకోలా కంపెనీ పానీయాలవల్ల ఆరోగ్యానికి హాని అని తెలిపి ప్రపంచపు ఒత్తిళ్ళలోనూ కోకాకోలా ను దేశం నుండి బ్యాన్ చేసేశాడు.
జార్జ్ ధీరుడు.. వీరుడు. ఏవిధమైన విదేశీ ఒత్తిళ్ళకూ లంచాలకూ లొంగలేదు.
ముందు జనతాపార్టీ ముక్కలవడంతో లాలూ ప్రసాద్ యాదవ్ జతలో చేరాడు. అప్పట్లో లాలూకు మంచి ప్రజాబలం.. (ఇప్పటికీ ఉన్నది.. వేరే రకంగా.. అది వేరే విషయం)
యాదవకులానికి చెందిన లాలూ కులరాజకీయాలు చేస్తుంటే తట్టుకోలేక జార్జ్ బయటికొచ్చేశాడు.
స్వంతంగా సమతాపార్టీ స్థాపించాడు. జార్జ్ తో నితీష్ కుమార్ జతకలిశాడు.
బిహార్ లో సమతాపార్టీ వేళ్ళూనుకుంది. అదే ఇప్పుడు జెడియుగా పేరు మార్చుకుంది.
====
ముందు అటల్ బిహారీ వాజపేయి జతకలిశాడు.
అటల్ జార్జ్ పై పూర్తి నమ్మకంతో రక్షణశాఖను అప్పగించి మంత్రిని చేశాడు.
భారతదేశం అంటే ఏమిటో ప్రపంచానికి తొలిసారి చెప్పిన త్రిమూర్తులు అటల్, జార్జ్ మరియు అబ్దుల్ కలాం.
ఫోక్రాన్ అణుబాంబ్ ప్రయోగం, కార్గిల్ యుద్ధాన్ని సమర్థవంతంగా నియంత్రించగలిగారు.
కార్గిల్ యుద్ధరంగానికే వెళ్ళారు జార్జ్. సైనికులు పడే కష్టాన్ని కళ్ళారాచూసి చలించిపోయారు.
సైనికులు హిమాలయాల్లో సంచరించడానికి సరైన బూట్లు ఇవ్వలేని కాంగ్రెస్ పై రగిలిపోయారు.
బులెట్ ప్రూఫ్ జాకెట్ అవశ్యకత ఉండింది. వెంటనే అక్కడి అందరు సైనికులకూ ఈ వసతులు కల్పించాడు.. అదీ సమర్థత అంటే.
జార్జ్ ఫెర్నాండెజ్ మార్గదర్శనంలో మన సైన్యం పాకిస్తాన్ సైనికుల్ని మట్టికరిపించి తోకముడిచేలా చేసింది.
యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల దేహాలను వారి ఇళ్ళ స్థలాలకు పంపే ఏర్పాట్లు చేయబోగా శవపేటికల అవసరం వచ్చేది.
తక్షణం విదేశాలనుండి శవపేటికలను తెప్పించి వీరసైనికులను వారి ఇళ్ళకు గౌరవంగా పంపించేవారు.
ఇక్కడ విషయం వేరొకటి.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ శవపేటికల కొనుగోలులో అక్రమాలు జరిగాయని అందులో జార్జ్ ఫెర్నాండెజ్ హస్తముందని ఆరోపణలు చేసింది.
“జార్జ్ లంచం తిన్నాడు.. దేశానికి మోసం చేశాడు. క్షమాపణ చెప్పాలి... శవపేటికల కుంభకోణంపై దర్యాప్తు చేయాలి” ఇదీ కాంగ్రెస్ మూర్ఖపు వాదన.
పచ్చ కామెర్లు వచ్చిన రోగికి లోకం పచ్చగానే కనబడుతుందట.
బలహీనమైన సంకీర్ణప్రభుత్వంలో చిన్నచిన్న లుకలుకలు.. దేశం మొత్తమ్ కాంగ్రెస్ పార్టీ మీడీయాద్వారా శవపేటికల స్కాం అంటూ హల్ చల్ చేసింది.
పాపం జార్జ్ ఫెర్నాండెజ్..
ఆయనకు కనీసం బ్యాంక్ అకౌంట్ లేదు.
రెండు గదుల ఇల్లు. ఒకే ఒక స్యూట్ కేస్ అందులో ఒక జుబ్బా, పైజమా సెట్టు, టూత్ బ్రష్, పేస్టు.
వీటితోపాటు ఒక జత హవాయి చెప్పులు.
వేసుకున్న జుబ్బా పక్క జేబులో ఒక్క పైసా కూడా ఉండేదికాదు. ఎందరెన్ని చెప్పినా వారించేవారు.
ఎక్కడికైనా సభలకు సమావేశాలకు వెళ్ళడానికి టికెట్లను పార్టీ సమకూర్చేది. హోటల్ లో కూడా భోజన వసతి పార్టీనే చేయాలి. పొరబాటున రోజువారీ భోజనం రాకుంటే జార్జ్ ఉపవాసం చేసేవారేగానీ ఎవ్వరికీ కనీసం విషయం చెప్పేవారే కారు.
ఇటువంటివ్యక్తి వీరమరణం పొందిన సైనికుల వెల కట్టలేని దేహాలను వారి కుటుంబాలకు సాగించేందుకు అవసరమయ్యే శవపేటికలకోసం లంచం తీసుకుంటారా?
పార్టీల పైశాచిక రాజకీయనృత్యానికి కుంగిపోయాడు.
కళ్ళల్లో నీరు ధారలా కారడం లేదూ...!!!?
జార్జ్ ఫెర్నాండెజ్ అనుకునుంటే ఎంత డబ్బు, ఆస్తి సంపాదించేవారు? గ్రామం లోని సర్పంచ్ కూడా కోట్లకు పడగలెత్తుతాడు.. ఓ సామాన్య ప్రభుత్వాధికారి తరతరాలు కూర్చుని తినేలా సంపాదిస్తాడు. అటువంటిది జార్జ్ ఎందుకు పార్టీలతో నిందలు పడాల్సి వచ్చింది? నిజంగా డబ్బు తిని ఉంటే ఈ నింద అసలు పడేదా?
అత్యంత సరళమైన, సౌమ్యగుణం, వ్యక్తిత్వాన్ని పొందిన జార్జ్ ఫెర్నాండెజ్ గారిని తలచుకుంటేనే కన్నీళ్ళు ఆగవు.
ఇటువంటి మహనీయుణ్ణి రాజకీయం కోసం వాడుకుంది కాంగ్రెస్ పార్టీ.
======
కర్ణాటకలోని మంగళూరులో పుట్టి, మహారాష్ట్రలో పెరిగి బిహార్ రాష్ట్రం లో రాజకీయ జీవితం కొనసాగించి.. డిల్లీనుండి దేశం మొత్తం గర్వపడేలా అనేక నిర్ణయాలు చేసిన జార్జ్ ఫెర్నాండెజ్ కాంగ్రెస్ నిందలకు కుంగిపోయారు..
రాజకీయాలు ఇక చాలు అనుకునేంతలోనే అల్జీమర్స్ అనే (మరుపు-తనెవరో కూడా మరిచిపోయే రోగం)  వ్యాధిన పడ్డారు..
మంచిదే.. తనకు జరిగిన అవమానలను మరవడమే ఆయనకు చివరన మంచానపడినా... ఏమీ ఇవ్వని దేశం కనీసం చివరన మరచిపోయే వ్యాధిని ప్రసాదించి ప్రశాంతంగా చిన్న గదిలో గడిపేలా చేసింది.
తండ్రికి ఇష్టం కాలేదు. పార్టీకి ఇష్టం కాలేదు.. చివరన కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలు నిందలతో చాలామంది అభిమానులనూ దూరం చేసుకున్నారు..
అయితే ఆ వ్యక్తిత్వం తెలిసిన నాలాంటి వ్యక్తులకు ఆయనెప్పుడూ గొప్ప నాయకుడే.. మహనీయుడే.
29.01.2019న తన ఇంటి చిన్న గదిలోనే వయసురీత్యా వచ్చిన వ్యాధులు, స్వైన్ ఫ్లూ వ్యాధిసోకడం తో... చాలు చాలికచాలని తమ 88వ ఏట తుది శ్వాస విడిచారు.. జార్జ్ ఫెర్నాండెజ్.
సర్. నేను సామాన్యుణ్ణి. మీకేదైనా సేవచేద్దామన్నా స్వీకరించని ఉన్నత మనస్తత్వంతో జీవించారు మీరు.. నా కంట్లోంచి రాలే చిన్న చిన్న కన్నీటిబొట్లే మీకు నేఇచ్చే నివాళి..
స్యాల్యూట్ సర్.
జార్జ్ ఫెర్నాండెజ్ సర్.
అటల్ బిహారీ వాజపేయి, అబ్దుల్ కలాం మరియు మీరు
ముగ్గురూ త్రిమూర్తులు
అమర్.. అక్బర్.. ఆంథోని..లు సర్ మీరు..
మళ్ళీ మీరు ముగ్గురూ ఒకేరోజు మనదేశంలోనే పుట్టాలి. మీకు మరో జన్మలోనైనా ఈదేశం తగిన గౌరవం ఇస్తుంది.. నా దేశం మహోన్నత భారతదేశం..
జై భారత్. జైజై భారత్.

3.జాతీయ కారులు వారి రచనలు

జాతీయ కారులు వారి రచనలు
1. మహాత్మాగాంధి: -
మై ఎక్సపెరిమెంట్ విత్ ట్రూత్
హింద్ స్వరాజ్, రోమా రోలా
కాంక్వస్ట్ ఆఫ్ సెల్ఫ్ , ఇండియన్ హోంరూల్
2. సుభాష్ చంద్ర బోస్ :
యాన్ ఇండియన్ ఫిలిగ్రిమ్ 
ద ఇండియనస్ట్రగుల్
3. బాలగంగాధర్ తిలక్ :. 
గీతా రహస్యము 
ఆర్కిటిక్ హోమ్ అఫ్ వేదాస్ 
4. సరోజినాయుడు 
గోల్డెన్ త్రిసోల్డ్ 
బ్రోకెన్ వింగ్స్ 
ది సాంగ్ ఆఫ్ ఇండియా 
5. అబుల్ కలం ఆజాద్ 
ఇండియా విన్స్ ఫ్రీడమ్ 
6. వి. డి . సావర్కర్ 
ఇండియన్ వార్ ఆఫ్ ఇండి పెండిట్స్ 
7. లాలా లజపతిరాయ్ 
ఆన్ హ్యాపీ ఇండీయా 
8. అరవింద్ ఘోస్ :
ది లైఫ్ డివైన్ 
ఎస్సెస్ ఆన్ గీత , సావిత్రి ,ఊర్వశి 
9. సి . రాజగోపాలాచారి :
ది నేషన్స్ వాయిస్ 
ది ఫాటల్ కార్ట్ 
రీ కాన్సిలియేషన్ 
వై & హౌ 


Wednesday

5.క్రీడాకారులు వారి రచనలు

1. సునీల్ గవాస్కర్ ---సన్నీ డేస్ , ఐడల్స్
2. కపిల్ దేవ్ --స్ట్రెయిట్ ఫ్రమ్ ది హార్ట్ , బైగాడ్స్ డిక్రీ
3. పి. టి . ఉష --గోల్డెన్ గర్ల్
4. విశ్వనాథన్ ఆనంద్ --మై బ్యూటిఫుల్ గేమ్ అఫ్ చెస్
5. డేవిడ్ బెక్ హమ్ --మై సైడ్
6. పీలే --మై లైఫ్ అండ్ ది బ్యూటిఫుల్ గేమ్
7. డాన్ బ్రాడ్ మన్ --ది ఆర్ట్ ఆఫ్ క్రికెట్
8. ఇమ్రాన్ ఖాన్ --అల్ రౌండ్ వ్యూ
9. టైగర్ వుడ్స్ --హౌ ఐ ప్లే గోల్ఫ్
10. మన్సూర్ ఆలీ ఖాన్ పటౌడీ --టైగెర్స్ టేల్
11. జావేద్ మియాందాద్ --కటింగ్ ది జడ్జ్
12. మార్టినా నవ్రతిలోవా --బియింగ్ మై సెల్ఫీ
13. గ్యారీ సోబర్స్ --క్రికెట్ క్రూసేడర్స్
14. రామనాథన్ , రమేష్ కృష్ణన్ --ఏ టచ్ ఆఫ్ టెన్నిస్
15. స్టీవ్ వా --అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్

Tuesday

పెద్దలారా.....మేలుకోండి పిల్లలకు ...మంచిని నేర్పండి,సంస్కారాన్ని ఇవ్వండి.

25 సంవత్సరాలకు ముందు గోవా దగ్గర ఒక పల్లెటూరు ఉండేది.

ఆ వూరు అతిపెద్ద పుచ్చకాయలను పండించడంలో చాలా ప్రసిద్ధి పొందింది.

ఆ ఊరిలో రైతులు పంట కోసే సమయంలో పిల్లలకు ఒక పోటీ పెట్టేవారు.

పిల్లలు ఎవరికి ఎన్ని పూచ్చకాయలు కావాలంటే అన్ని తినవచ్చు.

ఎవరు ఎక్కువ కాయలు తింటే వారికి గొప్ప బహుమతి ఉండేది.

పిల్లలంతా ఆనందంగా ఆ పోటీలో పాల్గొనేవారు.

ఆ పిల్లలలో ఒక్కడికి IIT లో సీటు వచ్చి పక్క రాష్ట్రానికి చదువుకు వెళ్ళిపోయాడు.

ఆ అబ్బాయి 6 సంవత్సరాలు తర్వాత తన సొంత ఊరికి వెళ్ళాడు.

ఆ అబ్బాయికి చిన్ననాటి పుచ్చకాయలు తినే పోటీ గుర్తొచ్చి ఊరి బయటే ఉన్న కూరగాయల మార్కెట్టుకెళ్లి....

మొట్ట మొదట పెద్ద పుచ్చకాయను తృప్తిగా తినేసి వెళ్లాలని అనుకున్నాడు.

మార్కెట్లోకి వెళ్ళగానే ఒక చోట ఒక యువ రైతు పుచ్చకాయల పోటీ జరుపుతుండటం చూసి ఆనందంగా అక్కడికి వెళ్ళాడు.

కానీ ...

ఆ పోటీలో అన్నీ చిన్న చిన్న కాయలే ఉన్నాయి....

ఎక్కడ వేదికినా పెద్ద సైజు కాయలే కనబడలేదు.

ఆ అబ్బాయికి చాలా నిరాశ కల్గింది.

దేశంలోనే పెద్ద పుచ్చకాయలు పండించే ఊరిలో .....

చివరికి పెద్ద కాయలే పండ లేదు.

దీనికి కారణం ఏమై ఉంటుంది? అని ఆ అబ్బాయి ఆలోచించాడు.

చివరికి దానికి కారణం కనుక్కొన్నాడు.

తాను చిన్నగా ఉన్నప్పుడు...రైతులు కాయలపోటీల్లో...పెద్ద పెద్ద కాయలను ఇచ్చి వాటి గింజల్ని మాత్రం ఒక గిన్నెలోకి ఉంచమని... పిల్లల్ని కోరేవారు.

తర్వాతా ఆ గింజల్ని సేకరించి మళ్ళీ నాటుకొని పెద్ద పెద్ద కాయలని పండించేవారు.

కానీ తర్వాత ....ఆ రైతుల కొడుకులు ....వారసత్వం తీసుకొని
ఈ పోటీలు నిర్వహించసాగారు.

వారు ....పుచ్చకాయల పోటీల్లో పెద్ద కాయలకు బదులు ....చిన్న చిన్న నాసి రకం కాయల్ని ఇచ్చి పోటీలు జరిపారు. ఆ చిన్న కాయల గింజల్ని సేకరించారు.

పెద్ద కాయలను మాత్రం లాభాలకు అమ్మేవారు.
అలా ప్రతి సంవత్సరం చేశారు.

సరిగ్గా...4 సం. ల కే పెద్ద కాయలు కాయడమే నశించిపోయింది.

మనం కూడా ....మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో చాలా ఘోరంగా విఫలం అవుతున్నాము.

మన భారతీయ సంస్కృతిలో మహిమాన్విత గాధలైన రామాయణ, భగ్వద్గీతలను,మన సంస్కృతీ లోని మంచిని మన పిల్లలకు ఇవ్వడంలో మనం గత 25 సంవత్సరాలుగా విఫలమై...

వారికి పనికిమాలిన పుచ్చు గింజల్లాంటి పద్దతులను నేర్పించి......
మార్కులు వస్తే చాలు....ఇక మనుషులు ఏమైపోయినా ఫర్వాలేదు....
పెద్ద ఉద్యోగం వస్తే చాలు...తల్లి దండ్రులను తన్ని తరిమేసినా ఫర్లేదు......

ఆడపిల్లలను ....ఆకలిగా చూసినా ఫర్లేదు....బాగా డబ్బు సంపాదిస్తే చాలు.....

.పేదవాడికి కాస్త సాయం చేయక పోయినా ఫర్లేదు......

ఆస్తులు కూడబెడితే చాలు.....అన్న చందంలో.... పెద్దలు జీవించడం వలనే......

ఈ నాడు ఇంట్లోని ఆడబిడ్డను బయటికి పంపాలంటే ....భయపడే దౌర్భాగ్యం దాపురించింది.

పెద్దలారా.....మేలుకోండి
పిల్లలకు ...మంచిని నేర్పండి,సంస్కారాన్ని ఇవ్వండి.

రాముడి వంశం లో పుట్టావు అని కాదు ముందు రాముడి గొప్పతనం గురించి చెప్పండి......

వచ్చే కాలమంతా బాగుంటుంది.
లేకపోతే...

ఇలాగేIIT ఫౌండేషన్ లు, ఒలంపియడ్ లు అంటూ పిల్లలను నాశనం చేసి...

సర్కస్ లో సీంహలు లా తీర్చి దిద్దకండి.

6.ఆర్థిక వేత్తలు వారి రచనలు

1. ఆడమ్ స్మిత్ --- ది వెల్త్ అఫ్ నేషన్స్
2. కార్ల్ మర్క్స్ --దాస్ కాపిటల్ , కమ్యూనిస్ట్ మ్యానిఫెస్టో
3. రాబర్ట్ మల్దాస్ --ఎస్సే ఆన్ పోపులేషన్
4.డేవిడ్ రికార్డో --ప్రిన్సిపుల్స్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ అండ్ ట్యాక్సేషన్స్
5. జాన్ స్టువర్ట్ మిల్ --ఆన్ లిబర్టీ అండ్ సిస్టమ్ ఆఫ్ లాజిక్
6. జగదీష్ భగవతి --మిస్ ఎ స్ట్రీమ్ ఆఫ్ విండోస్ :ఆన్ సెట్టింగ్ రిఫ్లెక్షన్ ఆన్ ట్రేడ్ , ఇమిగ్రేషన్ అండ్ డెమోక్రసీ , ఇండియా ఇన్ ట్రాన్సిసన్ :ఫ్రీయింగ్ ది ఎకానమీ , డి ఫెన్స్ ఆఫ్ గ్లోబలైజేషన్


Friday

కరుణమయుడు

కొత్తగా రిలీజ్ అయిన సినిమాకు నేను నా పిల్లలతో థీయేటరుకు వెళ్ళాను.

' టిక్కెట్టు ఎంతండీ? " ఆని అడిగాను........

" కొత్త సినిమా కదా! అందులో ప్రముఖ హీరో సినిమా మరి.,.ఒక్కొక్క టికెట్టు
  500 రూ.  ఇవ్వమంటారా? " కౌంటరులోని వ్యక్తి........

ఒక్కనిమిషం ఆలోచించాను.......మేము నలుగురం . అంటే 2000 రూ.
ఒక్క 2 గంటల సినిమాకు ఖర్చు........వెంటనే సినిమా హాలు బయటకు
వచ్చి ఆటో ఎక్కాను. ఆటోవాలా " ఎక్కడికి వెళ్ళాలి సార్ ?" అని అడిగాడు.

పిల్లలు.........భార్య కాస్త దిగులుగా ఉన్నట్టు అనిపించింది. అయినా
సరే అనుకుని ఆటోవాలాతో పక్కనే ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్ళమని
చెప్పేశాను. ఆటోవాలా కూడా మమ్మల్ని అక్కడ దింపేసి వెళ్ళిపోయాడు.

వృద్ధాశ్రమంలోకి వెళ్ళి  ఒకపూట ఈ వృద్ధులకు భోజనానికి ఎంత అవుతుందని
అడిగాను.......ఆశ్రమంలోని వ్యక్తి 1500 రూ. అవుతుందని చెప్పగానే

" నా దగ్గర 2000 రూ. ఉన్నాయి........ఈ పూటకు ఈ పెద్దవాళ్ళకు
  బోజనాలు పెట్టించండి....మరొక చిన్న విన్నపం.....నాకు నా తల్లిదండ్రులు
  చిన్నప్పుడే చనిపోయారు. మేము కూడా ఈ రోజు ఇక్కడే భోంచేసి
  మా పిల్లలు తాతయ్యలతో, నాన్నమ్మలతో, అమ్మమ్మలతో గడుపడానికి
  మాకు అవకాశాన్ని ఇవ్వండి దయచేసి " అని అన్నాను.

సినిమాకు తీసుకెళ్ళకుండా ఇక్కడికి తీసుకుని వచ్చానని నాపై కాసేపు
అలిగినా........అక్కడ ఆ పెద్దలతో ఆటలు....పాటలు కథలతో
మా పిల్లలు ......మేము చాలా సంతోషంగా గడిపి వచ్చాము....

భోంచేసి బయటికి రాగానే ఒక పెద్దమ్మ నన్ను నా కుటుంబాన్ని ఇలా
దీవించింది.......

" మాకు కూడా మనవళ్ళు.........మనవరాళ్ళు ఉన్నారు. వారితో ఆడుకోవాలని
   ఎన్నెన్నో కథలు చెప్పాలని ఉండేది ...మాకు భోజనాన్ని అందించడమే
   కాకుండా మా సొంత కొడుకులా మాతో గడిపి వెళుతున్నందుకు మీరు
   మీ కుటుంబం కలకాలం సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళూ ఆనందంగా
   ఉండాలని ఈ పండుటాకు దీవిస్తోంది. నీలాంటి వారికి దేవుడు అన్ని
   విధాలుగా తోడుగా ఉంటాడు......జాగ్రత్తగా వెళ్ళిరండి "

నా భార్య కళ్ళల్లో ఓ గర్వంతో కూడిన ఆనందం......నా పిల్లల మొహంలో
సినిమాకు వెళ్ళినా కనపడని సంతోషం కనిపించింది.......మంచి పనిచేశానన్న
తృప్తితో ఇంటికి వచ్చాను...........
.
.
.
.
.......అందరికి తెలియచేయాలని ఈ కొట్టుకొచ్చిన పోస్ట్.......⁠⁠⁠⁠
.
.
ఈ పోస్ట్ కి మీ కామెంట్స్ పెట్టండి

Wednesday

మనిషి దేన్నీ..... ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు

ఒక వ్యక్తికి నలుగురు  భార్యలు..........నాలుగవ భార్య అంటే చాలా ప్రేమ అతనికి...
ఆమెకోరిన కోరికలన్నీ తీర్చేవాడు......అపురూపంగా చూసుకునేవాడు...
మూడవ భార్య అన్నా ఇష్టమే. కానీ తన గురించి మంచిగా స్నేహితులదగ్గర
చెప్పేవాడు కాదు.....తను వారితో వెళ్ళిపోతుందేమో అన్న భయంతో.......

రెండవ భార్యదగ్గరికి తనకు ఏదైనా సమస్య వస్తేనే వెళ్ళేవాడు...ఆమెకూడా
అతని సమస్యను తీర్చి పంపేది.....

మొదటి భార్య అంటే అస్సలు ఇష్టమే ఉండేదికాదు....ఆమెను అస్సలు పట్టించుకునే
వాడే కాదు......ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి.

అతని ఆరోగ్యం క్షీణించిపోయింది.ఇక తను బ్రతకను అని తెలిసిపోయి తనమీద
ఎవరికి నిజమైన ప్రేమ ఉందో తెలుసుకోవడానికి తన నాలుగవ భార్యను పిలిచాడు.

" నేను మరణానికి అతి దగ్గరలో ఉన్నాను......నిన్ను చాలా ప్రేమగా \
చూసుకున్నాను కదా! నాతో పాటు నువ్వు కూడా వచ్చేసేయ్....
మరణంలో కూడా నాకు నీతోడే కావాలి " అని అన్నాడు.

నాలగవ భార్య అది విని అతనికి దూరంగా జరిగిపోయింది, ఆశ్చర్య చకితుడై
తన మూడవ భార్యను ఇదే కోరాడు........

మూడవ భార్య ఇలా అంది.

" ఇన్ని రోజులు నీతోనే,,,,,,,,నీ దగ్గరే ఉన్నాను.......నీ అవసరాలన్నీ తోర్చాను
ఇక నాకు నీతో పనిలేదు.వేరేవారి దగ్గరికి వెళ్ళిపోతున్నాను:"

బాధతో ఏడుస్తూ తన రెండవ భార్యను ఇలాగే అడిగాడు......

" నేను నీతో పాటు నీ శవయాత్రలో పాల్గొనేంత వరకు నీవెంట ఉంటాను
తరువాత నేను వెళ్ళిపో్తాను.....నిన్ను అప్పుడప్పుడు తలచుకోగలను." అంది.

ఇంత ప్రేమగా చూసుకున్న ఈ ముగ్గురూ ఇలా అనేసరికి ఇక మొదటి భార్యను
బాగా నిర్లక్ష్యం చేశానుకదా తనని అడగడం వృద్ధా అని భావిస్తుండగా.......

మొదటిభార్య తలుపు చాటునుండి ఇలా అంది.

" మీరు నన్ను ఎంత నిర్లక్ష్యం చేసినా నేను మాత్రం మీ వెంట మీ చివరి పయనం
దాకా తప్పక వస్తాను........మీరేమీ బాధపడకండి "

అతని కంట నీరు ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది.....కాబట్టి మనిషి దేన్నీ.....
ఎవరినీ నిర్లక్ష్యం చేయకూడదు.......మన దగ్గర ఉన్నప్పుడు దాని విలువ
తెలియదు.........పోయే ముందు తెలుసుకుని ప్రయోజనం ఉండదు.

నిజం చెప్పాలంటే మనం అందరం నలుగురు భార్యల్తోనే ఉంటున్నాము.
అదేంటి అలా అంటున్నారు అని ఆశ్చర్యంగా ఉందా???????

నాలుగవ భార్య......... మన శరీరం......

మూడవ భార్య ...............సంపద, ఆస్థిపాస్తులు......

రెండవభార్య.......... నేస్తాలు........బంధువులు.......

మొదటి భార్య..............మన ఆత్మ..........

నిజమే కదా! దయచేసి మన ఆత్మ చెప్పిన దాన్ని ఆచరించండి....
పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేయకండి........సరేనా!

కథ కంచికి మనం ఇంటికి...

ఉమేష్ చంద్ర స్టాట్యూ

చదలవాడ ఉమేష్ చంద్ర …
పోలీస్ వర్గాలలో ఈ పేరు చెబితే చాలు వాళ్ళ రోమాలు నిక్కబొడుస్తాయి .. రక్తం పోటెత్తుతుంది, కానీ ఇప్పటి యువతరానికి పెద్దగా తెలియదు, మహా అయితే హైదరాబాద్ అమీర్ పేట, ఎస్.ఆర్.నగర్ ఏరియాల్లో ఉండేవాళ్ళకి ”ఉమేష్ చంద్ర స్టాట్యూ దగ్గర” అని అడ్రస్ లాండ్ మార్క్ గా చెప్పడానికి తెలుసేమో మరి ఎవరీ ఉమేష్ చంద్ర ..
నక్షలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం లాంటి ఇజాలకు తన పోలీసిజం రుచి చూపించిన ఒక్క మగాడు .. దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ లాంటి పదాలకు ప్రాణం పోస్తే ఆయన రూపం .. మనకు తెలుగు సినిమాలలో చాలా మంది పులులు సింహలు ఉన్నారు, కానీ నిజజీవితంలో “కడప పులి” అని పేరుగాంచిన పోలీస్ అధికారి ఉమేష్ చంద్ర.. ఆయన అమర మరణం చెంది నేటికి 17 సంవత్సరాలు .. ఆయన కథేంటో చూద్దాం .. ఉమేశ్ చంద్ర మార్చి 19, 1966 న గుంటూరు జిల్లా పెదపూడి గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించారు. 1991లో IPS కి ఎన్నికై, 1991-92 లో ‘జాతీయ పోలీస్ అకాడమీ’ లో శిక్షణ పొందారు, మొదట 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ASP గా పని చేశారు. వరంగల్లులో పనిచేసిన కాలంలో “జనజాగృతి” అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు, దాని ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వరంగల్లు గ్రామాల్లో పాతుకుపోయిన నక్షలిజాన్ని రూపుమాపడానికి కృషిచేస్తూ మొదటి పోస్టింగుతోనే నక్షల్స్ కు బద్దవిరోధి అయ్యారు. తరువాత కడప జిల్లాలో ఫాక్షనిజంతో కరుడుగట్టిన పులివెందుల ఏరియాకి గా బదిలీ చేయబడ్డారు, అక్కడ పనిచేసింది కేవలం 4 నెలలు మాత్రమే కానీ తన చర్యలతో అక్కడి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. మనం కేవలం సినిమాల్లో చూసే పోలీస్ హీరోయిజాన్ని పులివెందుల్లో చూపించారు, చిన్న చిన్న గుండాల నుండి బడా బడా ఫ్యాక్షనిస్టులకు కంటికి నిద్రలేకుండా చేసారు, అర్ధారాత్రులు, తెల్లవారుజాము ఇలా విశ్రాంతి అనేదే లేకుండా రైడింగులు చేస్తూ దొరికిన వాడిని దొరికినట్లుగా అరెస్టులు చేస్తూ ప్రజలకి ఒక భరోసా కల్పించారు, మామూలుగా సినిమా హీరోల పైన, రాజకీయనాయకుల పైన పాటలు వ్రాస్తారు అలాంటిది పోలీసు అధికారి పై పాటలు వ్రాసారు అదికూడా కేవలం నాలుగు నెలల కొంచెం సమయంలోని ఆయన చేసిన పనికి ఈ ఒక్కటి చాలు ఆయన శాంతిని నెలకొల్పడానికి చేసిన పనులు అక్కడ ప్రజలను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలియడానికి.
ఫిబ్రవరి 1995 లో వరంగల్లు ‘ప్రత్యేక విధుల అధికారి’ గా నియమితులయ్యారు, ఈసారి నక్షలిజం పై విరుచుకుపడ్డారు, వరంగల్లులో తొలిసారిగా ప్రజలు కష్టం వస్తే అన్నలను కాకుండా పోలీసులను కలవడం మొదలుపెట్టారు, ఈమధ్య కాలంలో బాగా వినిపిస్తున్న ఫ్రెండ్లీ పోలీస్ ని అప్పట్లోనే ఆయన ఆచరించి చూపించారు, ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యారు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది కడప జిల్లాకు తిరిగి వచ్చారు. తరువాత జూన్ 1997 న కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా బదిలీ అయ్యారు, ఈ రెండు సంవత్సరాలలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎంతో మంచిచేసింది, ఆయన్ని కడప ప్రజలు ఎంతలా అభిమానించారంటే ఆయన బదిలీ ఆపమని ధర్నాలు కూడా చేసారు, ఆయన బదిలీ అయి వెళుతున్న రోజు ప్రజలు ఆయనికి పలికిన వీడ్కోలు అంతకుముందు గానీ, ఆ తరువాత గానీ ఎక్కడా ఏ పోలీసు అధికారికి జరగలేదు, ఉమేశ్ చంద్ర సెప్టెంబరు 4, 1999 న హైదరాబాదు యస్సార్ నగర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడారు. ఆయన వద్ద గన్ లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.