#AnjapallyNagamallu Anna God job anna 🙏 🙏
సూర్యాపేట జిల్లా నూతనకల్ మబడలం , చిలపకుంట్ల గ్రామములో రెండు కాళ్ళు లేని ఒక వికలాంగుడు మాట్టే చంద్రయ్య(55) తనతల్లి చంద్రమ్మ(90) సంవత్సరాల పండు ముసలి తల్లిని అన్ని తానై సాగుతున్న వైనం టీవీ లో వస్తే చూసాను ఉండటానికి ఇల్లు లేదు రెండుకాళ్ళు చిన్ననాటినుండే పోలియో తో చచ్చుబడి పోయిన చంద్రయ్య తనను పెంచి పోషించిన తల్లికోసం ఇల్లు ఇల్లు తిరిగి అన్నం అడుకొచ్చి పెడుతూ సాదటం కన్నతల్లి ని ఎలా చూేసుకోవాలో తెలిపాడు. "మనల్ని కన్న తల్లిదండ్రులను అనాధాశ్రమం లో వదిలి.. మనం కొన్న కుక్క పిల్లల్ని పరుపు దిండ్ల మీద పెంచుతున్న రోజులివి" ఒక వికలాంగుడు ఎలాంటి ఆర్థిక స్థోమత, సెంటు భూమి లేని వ్యక్తి తన తల్లి కి అడుకొచ్చి పెట్టి సాదటం మనసును కదిలించింది, తన ఊరు వెళ్లి చూస్తే ఎండలో ఒక కాళ్ళమంచం పై పడుకున్న పండు ముసలి తల్లిని నీడకు తీసుకెళ్లలేక ఒక దుప్పటి కప్పి పక్కనే కూర్చున్నాడు ఎందుకంటే ఇల్లు లేదు రాత్రి చలికి వణికిపోతున్న తల్లికి రెండు దుప్పట్లు కప్పి పైన కవరుతో కప్పి ఉంచుతానాని రాత్రి సమయంలో పాములు , తేళ్లు, వస్తున్నాయని కుక్కలనుండి కూడా రక్షణ లేదని గ్రహించిన నేను వెంటనే నాలుగు గుంజల పాతించి కవరు కప్పిన చిన్న గుడిసె తాత్కాలికంగా ఏర్పాటుచేయడం జరిగింది. వారికి ముందు ఒక గూడు అవసరం వారికి రూమ్ కట్టించాలి అనుకున్నాను కానీ ఆ సమయంలో నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉంది .. ఏమి చెయ్యాలో అర్థం కావడం లేదు .. కానీ ఏదో ఒకటి చెయ్యాలి అని మాత్రం నిర్ణయించుకున్నాను వెంటనే నా మెడపై ఉన్న బంగారు గొలుసు, చేతి ఉంగరం , మా పాపా బారసలకి తీసుకున్న రెండు గాజులు ముతూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టి సుమారు 65 వేల రూపాయల తీసుకొని వెంటనే ఆ ఊరికి వెళ్లి ఇంటి నిర్మాణానికి పునాది తీయించి రాయి, ఇసుక, సిమెంట్, ఇటుక తోలించి ఒక ఇంటిని నిర్మించి ఇచ్చాను వారికి ఈరోజు కొత్త బట్టలు పెట్టి ఇంటిని ప్రారంభించాం.ఈరోజు వారి కళ్ళల్లో ఆనందం చూస్తే నా బాధలన్ని మర్చిపోయాను.. " మనం గొప్పగా బ్రతకడమే కాదు మన తోటి వారి బాధల్ని పంచుకోవడమే జీవితం" అని మా అమ్మ నాన్న చెప్పిన మాటలు గుర్తుకుతెచ్చుకున్నాను.