Friday

Save birds

ఇది కథ కాదు..

చైనా లో ఒక పిచ్చుక ఒక సంవత్సరం లో సుమారు ఆరున్నర కిలోల బియ్యం ని తింటుందని లెక్క తేల్చారు. ఆ ధాన్యం అంతా కాపాడితే అరవై వేల మంది జనాభాకి ఆహారం సమకూర్చవచ్చని డిసైడ్ అయ్యారు! దాంతో సుమారుగా 30 లక్షల పిచ్చు కలని చంపేశారు!డబ్బాలతో కొట్టి చప్పుడు చేసి పారదోలారు. గూళ్లలో ఉన్న పిచ్చుకల గుడ్లన్నీ పగలకొట్టి చంపారు!
అలా పిచ్చుకలని నిర్మూలించటం వల్ల పంటలన్నీ పురుగు పట్టి అసలు ధాన్యమే లేకుండా పోయింది! ఆ దెబ్బకి తిండి దొరక్క తదనంతర కాలం లో తీవ్రమైన కరువు ఏర్పడింది.సుమారు నాలుగున్నర కోట్ల మంది తిండి దొరక్క చనిపోయారు!
ఈ కరువు నించి బయట పడటానికి..జరిగిన నష్టాన్ని పూడ్చుకోటానికి చైనా సోవియట్ యూనియన్ నించి వేల కొద్దీ పిచ్చుకలని దిగుమతి చేసుకుంది!

నీతి:- 1.Don't play games with nature.
2.Save birds.